తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. జమున హ్యాచరీస్ కోసం పేదల నుంచి ఆయన కుటుంబం స్థలాలను బలవంతంగా లాక్కుందనే ఆరోపణలపై కేసు నడుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే హైకోర్టు కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది. అధికారులు సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అయితే ఆ విషయం అటుంచితే ఇప్పుడు ఈటల భవిష్యత్తు ఏమిటి ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈటల తెరాసలో కొనసాగే అవకాశం అస్సలు లేదు. అయిపోయింది. నేడో, రేపో ఆయన ఎమ్మెల్యే పదవికి, తెరాస సభ్యత్వానికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అయితే తదుపరి ప్రణాళిక ఏమిటి ? కొత్త పార్టీ పెట్టాలా ? ఏదైనా వేరే పార్టీలో చేరాలా ? అని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకనే తన నియోజకవర్గ ప్రజలు, అనుచరులు, అభిమానులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. అయితే ఈటల రాజేందర్ బీజేపీలోనే చేరుతారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య ధోరణి అనేది ముందు నుంచి ఉంది. గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరని రాజకీయ విశ్లేషకులు ఎప్పుడూ అంటుంటారు. అలాంటి పార్టీలో బలమైన నేతలకు సరైన గుర్తింపు ఉండదని అంటుంటారు. రేవంత్ వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. పలువురు సీనియర్లు అడ్డుకున్నారనే ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి రాకుండా పోయిందని అంటుంటారు. ఈ క్రమంలో అలాంటి పార్టీలో చేరితే మనుగడ కష్టమవుతుందని ఈటల భావిస్తున్నట్లు తెలిసింది.
ఇక ఇప్పటికిప్పుడు కొత్త పార్టీ పెడితే దాన్ని బూత్ స్థాయిలో బలపరచాలంటే అందుకు చాలా సమయం పడుతుంది. కనుక కొత్త పార్టీ ఆలోచన లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈటల ముందు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. బీజేపీ ఇప్పటికే తెలంగాణలో కొంత వరకు బలం పుంజుకుంది. మరోవైపు కేంద్రంలోనూ అధికారంలో ఉంది కనుక అందులో చేరితే ఈటలకు బలం చేకూరుతుంది, ఇంకో వైపు రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది. కనుక ఆయన అందులో చేరే అవకాశాలను కొట్టి పారేయలేమని విశ్లేషకులు అంటున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డితోపాటు ఇప్పటికే అందులో ఉండి ఎవరి సపోర్ట్ లేకుండా కాలం నెట్టుకొస్తున్న రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారని ఊహాగానాల వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజమవుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…