తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. జమున హ్యాచరీస్ కోసం పేదల నుంచి ఆయన కుటుంబం స్థలాలను బలవంతంగా లాక్కుందనే ఆరోపణలపై కేసు నడుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే హైకోర్టు కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది. అధికారులు సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అయితే ఆ విషయం అటుంచితే ఇప్పుడు ఈటల భవిష్యత్తు ఏమిటి ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈటల తెరాసలో కొనసాగే అవకాశం అస్సలు లేదు. అయిపోయింది. నేడో, రేపో ఆయన ఎమ్మెల్యే పదవికి, తెరాస సభ్యత్వానికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అయితే తదుపరి ప్రణాళిక ఏమిటి ? కొత్త పార్టీ పెట్టాలా ? ఏదైనా వేరే పార్టీలో చేరాలా ? అని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకనే తన నియోజకవర్గ ప్రజలు, అనుచరులు, అభిమానులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. అయితే ఈటల రాజేందర్ బీజేపీలోనే చేరుతారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య ధోరణి అనేది ముందు నుంచి ఉంది. గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరని రాజకీయ విశ్లేషకులు ఎప్పుడూ అంటుంటారు. అలాంటి పార్టీలో బలమైన నేతలకు సరైన గుర్తింపు ఉండదని అంటుంటారు. రేవంత్ వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. పలువురు సీనియర్లు అడ్డుకున్నారనే ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి రాకుండా పోయిందని అంటుంటారు. ఈ క్రమంలో అలాంటి పార్టీలో చేరితే మనుగడ కష్టమవుతుందని ఈటల భావిస్తున్నట్లు తెలిసింది.
ఇక ఇప్పటికిప్పుడు కొత్త పార్టీ పెడితే దాన్ని బూత్ స్థాయిలో బలపరచాలంటే అందుకు చాలా సమయం పడుతుంది. కనుక కొత్త పార్టీ ఆలోచన లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈటల ముందు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. బీజేపీ ఇప్పటికే తెలంగాణలో కొంత వరకు బలం పుంజుకుంది. మరోవైపు కేంద్రంలోనూ అధికారంలో ఉంది కనుక అందులో చేరితే ఈటలకు బలం చేకూరుతుంది, ఇంకో వైపు రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది. కనుక ఆయన అందులో చేరే అవకాశాలను కొట్టి పారేయలేమని విశ్లేషకులు అంటున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డితోపాటు ఇప్పటికే అందులో ఉండి ఎవరి సపోర్ట్ లేకుండా కాలం నెట్టుకొస్తున్న రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారని ఊహాగానాల వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజమవుతుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…