తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్పై కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ ఆంక్షలను మరింతగా సడలించారు. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపులు ఉండేవి. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇళ్లకు వెళ్లేందుకు మరో గంట అదనంగా సడలింపులు ఇచ్చారు. అయితే ఇకపై ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉంటుంది. ఇంకో గంట ఇంటికి వెళ్లేందుకు అదనంగా సడలింపు ఉంటుంది. దీంతో మొత్తం 12 గంటల పాటు సడలింపులు ఉంటాయి. ఇక సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది.
జూన్ 9వ తేదీతో రాష్ట్రంలో లాక్ డౌన్ గడువు ముగియనుండడంతో మంగళవారం సమావేశమైన తెలంగాణ కేబినెట్ సుదీర్ఘ సమయం పాటు చర్చించింది. లాక్డౌన్ పొడిగింపు, కరోనా మూడో వేవ్, టీకాల పంపిణీ వంటి అనేక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించారు. ఈ క్రమంలోనే లాక్డౌన్ను మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు నూతనంగా సవరించిన ప్రకారం లాక్డౌన్ ఆంక్షల సడలింపు ఉంటుంది.
కాగా జూన్ 21వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా టీకాలను ఇస్తామని మోదీ ప్రకటించిన విషయం విదితమే. అందులో భాగంగానే టీకాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…