తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్పై కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ ఆంక్షలను మరింతగా సడలించారు. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపులు ఉండేవి. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇళ్లకు వెళ్లేందుకు మరో గంట అదనంగా సడలింపులు ఇచ్చారు. అయితే ఇకపై ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉంటుంది. ఇంకో గంట ఇంటికి వెళ్లేందుకు అదనంగా సడలింపు ఉంటుంది. దీంతో మొత్తం 12 గంటల పాటు సడలింపులు ఉంటాయి. ఇక సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది.
జూన్ 9వ తేదీతో రాష్ట్రంలో లాక్ డౌన్ గడువు ముగియనుండడంతో మంగళవారం సమావేశమైన తెలంగాణ కేబినెట్ సుదీర్ఘ సమయం పాటు చర్చించింది. లాక్డౌన్ పొడిగింపు, కరోనా మూడో వేవ్, టీకాల పంపిణీ వంటి అనేక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించారు. ఈ క్రమంలోనే లాక్డౌన్ను మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు నూతనంగా సవరించిన ప్రకారం లాక్డౌన్ ఆంక్షల సడలింపు ఉంటుంది.
కాగా జూన్ 21వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా టీకాలను ఇస్తామని మోదీ ప్రకటించిన విషయం విదితమే. అందులో భాగంగానే టీకాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…