మన దేశంలో అసభ్య కార్యకలాపాలకు పాల్పడి పోలీసులకు దొరికితే అరెస్టు చేస్తారనే భయంతో విదేశాలకు చెక్కేసిన నిత్యానంద స్వామి గుర్తున్నాడా ? అవును. అతనే. అతను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా కరోనా నేపథ్యంలో నిత్యానందుడు మరోమారు వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
భారత్లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అయితే దేశంలో కోవిడ్ ఎప్పుడు అంతమవుతుందని ఓ శిష్యుడు ఆ నిత్యానందుడిని అడిగాడట. దీంతో నిత్యానందుడు బదులిస్తూ తాను భారత్లో అడుగుపెడితో కరోనా మాయమవుతుందని చెప్పాడట. దీంతో మరోసారి నిత్యానందుడు వార్తల్లో నిలిచాడు.
అన్నట్లు గుర్తుంది కదా.. నిత్యానందుడు ఇప్పటికే క్విటోలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాస అని పేరు పెట్టాడు. తన దేశానికి ఓ పాస్పోర్టును, జెండాను, జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస పేరిట ఓ బ్యాంకును కూడా ఏర్పాటు చేశాడు. తమ దేశ పౌరసత్వం కావాలంటే విరాళాలు అందించాలని కోరుతున్నాడు. అయితే నిత్యానందుడు పైన తెలిపిన విధంగా అనడం అందరికీ నవ్వు తెప్పిస్తోంది. నెటిజన్లు అతనిపై రక రకాల కామెంట్లు చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…