మన దేశంలో అసభ్య కార్యకలాపాలకు పాల్పడి పోలీసులకు దొరికితే అరెస్టు చేస్తారనే భయంతో విదేశాలకు చెక్కేసిన నిత్యానంద స్వామి గుర్తున్నాడా ? అవును. అతనే. అతను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా కరోనా నేపథ్యంలో నిత్యానందుడు మరోమారు వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
భారత్లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అయితే దేశంలో కోవిడ్ ఎప్పుడు అంతమవుతుందని ఓ శిష్యుడు ఆ నిత్యానందుడిని అడిగాడట. దీంతో నిత్యానందుడు బదులిస్తూ తాను భారత్లో అడుగుపెడితో కరోనా మాయమవుతుందని చెప్పాడట. దీంతో మరోసారి నిత్యానందుడు వార్తల్లో నిలిచాడు.
అన్నట్లు గుర్తుంది కదా.. నిత్యానందుడు ఇప్పటికే క్విటోలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాస అని పేరు పెట్టాడు. తన దేశానికి ఓ పాస్పోర్టును, జెండాను, జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస పేరిట ఓ బ్యాంకును కూడా ఏర్పాటు చేశాడు. తమ దేశ పౌరసత్వం కావాలంటే విరాళాలు అందించాలని కోరుతున్నాడు. అయితే నిత్యానందుడు పైన తెలిపిన విధంగా అనడం అందరికీ నవ్వు తెప్పిస్తోంది. నెటిజన్లు అతనిపై రక రకాల కామెంట్లు చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…