తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రేషన్ కార్డులు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే ఆ కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మొత్తం 4,46,169 మంది లబ్ధిదారులకు వెంటనే కార్డులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరో 15 రోజుల్లోగా అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కార్డులను జారీ చేయాలని కేబినెట్ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా మంగళవారం జరిగిన తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో వ్యవసాయ శాఖపై సమీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై రాష్ట్ర కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. గతేడాది వర్షాకాలం, వేసవి కలిపి మొత్తం 1,06,03,927 ఎకరాల్లో కేవలం వరి పంటనే రైతులు సాగు చేశారు. దీంతో సుమారుగా 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దీనిపై కూడా కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్బంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అధికారులు, సిబ్బందిని కేబినెట్ అభినందించింది. కాగా రాష్ట్రంలో మొత్తం 2,601 వ్యవసాయ క్లస్టర్లలో ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉంటూ రైతు వేదికల ద్వారా వారికి సలహాలు, సూచనలు అందజేయాలని సూచించింది. అలాగే ఖరీఫ్ కోసం పంటలు వేసేలా రైతులను సిద్ధం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంది. ఇక చేపలు, గొర్రెల పెంపకం తదితర రంగాల్లో కీలకమైన కృషి చేస్తునన్న రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కూడా కేబినెట్ అభినందించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…