తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రేషన్ కార్డులు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే ఆ కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మొత్తం 4,46,169 మంది లబ్ధిదారులకు వెంటనే కార్డులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరో 15 రోజుల్లోగా అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కార్డులను జారీ చేయాలని కేబినెట్ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా మంగళవారం జరిగిన తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో వ్యవసాయ శాఖపై సమీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై రాష్ట్ర కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. గతేడాది వర్షాకాలం, వేసవి కలిపి మొత్తం 1,06,03,927 ఎకరాల్లో కేవలం వరి పంటనే రైతులు సాగు చేశారు. దీంతో సుమారుగా 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దీనిపై కూడా కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్బంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అధికారులు, సిబ్బందిని కేబినెట్ అభినందించింది. కాగా రాష్ట్రంలో మొత్తం 2,601 వ్యవసాయ క్లస్టర్లలో ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉంటూ రైతు వేదికల ద్వారా వారికి సలహాలు, సూచనలు అందజేయాలని సూచించింది. అలాగే ఖరీఫ్ కోసం పంటలు వేసేలా రైతులను సిద్ధం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంది. ఇక చేపలు, గొర్రెల పెంపకం తదితర రంగాల్లో కీలకమైన కృషి చేస్తునన్న రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కూడా కేబినెట్ అభినందించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…