Telangana : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు షాకులిచ్చేందుకు రెడీ అవుతోందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో విద్యుత్ తోపాటు ఆర్టీసీ చార్జీలు కూడా భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చార్జిలు ఎంత మేర పెరుగుతాయోనని ప్రజలు ఇప్పటి నుంచే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ చార్జిల పెంపు విషయమై అధికారులు ఇది వరకే ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ చార్జిల పెంపు విషయమై నిర్ణయం తీసుకోలేదు. కానీ రెండు శాఖలకు చెందిన అధికారులు మరోమారు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారని, అందులో చార్జిల పెంపునకు అనుమతిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే త్వరలోనే ప్రజలపై రెండు చార్జిల భారం పడనుంది.
విద్యుత్ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీంతో చార్జిల పెంపునకు మార్గం సుగమం అవుతుంది. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి.. దాదాపుగా 7 సంవత్సరాలుగా విద్యుత్ చార్జీలను పెంచలేదు. కానీ తీవ్ర నష్టాలు వస్తున్నందున పెంపు తప్పదని తెలుస్తోంది.
ఇక మరోవైపు ఆర్టీసీ కూడా కోవిడ్ కారణంగా రూ.3వేల కోట్లు నష్టపోయినట్లు సమాచారం. కోవిడ్ వల్ల ఆర్టీసీ చార్జిలను పెంచలేదు. మరోవైపు డీజిల్ ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దీంతో ఏటా ఆర్టీసీపై అదనంగా రూ.550 కోట్ల భారం పడుతోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ చార్జిల పెంపు కూడా అనివార్యమేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం కేబినెట్ అనుమతి లభిస్తే వెంటనే చార్జిలను పెంచే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసి ఫలితాలు కూడా వచ్చాయి కనుక, ఇబ్బంది ఉండదు కాబట్టి.. సీఎం కేసీఆర్ కూడా ఈ చార్జిల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా.. రోజు రోజుకీ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు, గ్యాస్ ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక విద్యుత్, ఆర్టీసీ చార్జిలను కూడా పెంచితే ప్రజలకు నెలవారీ ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…