Telangana : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు షాకులిచ్చేందుకు రెడీ అవుతోందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో విద్యుత్ తోపాటు ఆర్టీసీ చార్జీలు కూడా భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చార్జిలు ఎంత మేర పెరుగుతాయోనని ప్రజలు ఇప్పటి నుంచే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ చార్జిల పెంపు విషయమై అధికారులు ఇది వరకే ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ చార్జిల పెంపు విషయమై నిర్ణయం తీసుకోలేదు. కానీ రెండు శాఖలకు చెందిన అధికారులు మరోమారు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారని, అందులో చార్జిల పెంపునకు అనుమతిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే త్వరలోనే ప్రజలపై రెండు చార్జిల భారం పడనుంది.
విద్యుత్ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీంతో చార్జిల పెంపునకు మార్గం సుగమం అవుతుంది. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి.. దాదాపుగా 7 సంవత్సరాలుగా విద్యుత్ చార్జీలను పెంచలేదు. కానీ తీవ్ర నష్టాలు వస్తున్నందున పెంపు తప్పదని తెలుస్తోంది.
ఇక మరోవైపు ఆర్టీసీ కూడా కోవిడ్ కారణంగా రూ.3వేల కోట్లు నష్టపోయినట్లు సమాచారం. కోవిడ్ వల్ల ఆర్టీసీ చార్జిలను పెంచలేదు. మరోవైపు డీజిల్ ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దీంతో ఏటా ఆర్టీసీపై అదనంగా రూ.550 కోట్ల భారం పడుతోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ చార్జిల పెంపు కూడా అనివార్యమేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం కేబినెట్ అనుమతి లభిస్తే వెంటనే చార్జిలను పెంచే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసి ఫలితాలు కూడా వచ్చాయి కనుక, ఇబ్బంది ఉండదు కాబట్టి.. సీఎం కేసీఆర్ కూడా ఈ చార్జిల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా.. రోజు రోజుకీ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు, గ్యాస్ ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక విద్యుత్, ఆర్టీసీ చార్జిలను కూడా పెంచితే ప్రజలకు నెలవారీ ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…