Telangana : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు షాకులిచ్చేందుకు రెడీ అవుతోందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో విద్యుత్ తోపాటు ఆర్టీసీ చార్జీలు కూడా భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చార్జిలు ఎంత మేర పెరుగుతాయోనని ప్రజలు ఇప్పటి నుంచే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ చార్జిల పెంపు విషయమై అధికారులు ఇది వరకే ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ చార్జిల పెంపు విషయమై నిర్ణయం తీసుకోలేదు. కానీ రెండు శాఖలకు చెందిన అధికారులు మరోమారు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారని, అందులో చార్జిల పెంపునకు అనుమతిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే త్వరలోనే ప్రజలపై రెండు చార్జిల భారం పడనుంది.
విద్యుత్ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీంతో చార్జిల పెంపునకు మార్గం సుగమం అవుతుంది. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి.. దాదాపుగా 7 సంవత్సరాలుగా విద్యుత్ చార్జీలను పెంచలేదు. కానీ తీవ్ర నష్టాలు వస్తున్నందున పెంపు తప్పదని తెలుస్తోంది.
ఇక మరోవైపు ఆర్టీసీ కూడా కోవిడ్ కారణంగా రూ.3వేల కోట్లు నష్టపోయినట్లు సమాచారం. కోవిడ్ వల్ల ఆర్టీసీ చార్జిలను పెంచలేదు. మరోవైపు డీజిల్ ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దీంతో ఏటా ఆర్టీసీపై అదనంగా రూ.550 కోట్ల భారం పడుతోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ చార్జిల పెంపు కూడా అనివార్యమేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం కేబినెట్ అనుమతి లభిస్తే వెంటనే చార్జిలను పెంచే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసి ఫలితాలు కూడా వచ్చాయి కనుక, ఇబ్బంది ఉండదు కాబట్టి.. సీఎం కేసీఆర్ కూడా ఈ చార్జిల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా.. రోజు రోజుకీ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు, గ్యాస్ ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక విద్యుత్, ఆర్టీసీ చార్జిలను కూడా పెంచితే ప్రజలకు నెలవారీ ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…