Sai Dharam Tej : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో 35 రోజుల పాటు చికిత్స పొందారు. వినాయకచవితి రోజు గాయపడ్డ ఆయన విజయదశమికి ఇంటికి వెళ్లారు. ఆ రోజు చిరంజీవి తన ట్వీట్లో ‘విజయ దశమి ప్రత్యేక రోజున సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సాయి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇటీవల పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డ తేజ్కు ఇది పునర్జన్మ’ అంటూ రాసుకొచ్చారు. అనంతరం తేజ్కు ఆయన బర్త్డే విషెస్ తెలిపారు.
ఇక తాజాగా చిరు తన ట్వీట్లో.. అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికీ ఇది నిజమైన పండుగ.. అని తన ట్వీట్లో పేర్కొన్నారు చిరంజీవి. ఆయన షేర్ చేసిన ఫొటోలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అకీరా, బన్నీ, నాగబాబు అందరూ ఉన్నారు. ఈ పిక్ మెగా అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
వినాయక చవితి రోజు బైక్పై వెళ్తున్న సాయి ధరమ్ తేజ్.. ప్రమాదవశాత్తూ జారిపడ్డారు. ఈ ప్రమాదంలో తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. కాలర్ బోన్ విరగడంతో సర్జరీ చేశారు. ప్రమాదం తీవ్రత కారణంగా సాయిధరమ్ తేజ్ కోమాలోకి వెళ్లాడని స్వయంగా పవన్ కల్యాణే కామెంట్ చేశారు. కానీ ఆయన ఇలా కోలుకొని మళ్లి ఇలా ఆనందంగా కనిపించడం అభిమానులకి ఆనందాన్ని కలిగిస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…