Whale Ambergris : సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులకు ఏకంగా రూ.50 కోట్ల విలువైన తిమింగలం వాంతి లభ్యమైంది. ఆ వాంతి బరువు 38.6 కిలోలు ఉండగా.. దాన్ని అంబర్గ్రిస్గా పిలుస్తున్నారు. అయితే ఈ వాంతికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇంతకీ అసలు ఏం జరిగింది.. అన్న వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కడపాక్కం సమీపంలోని కడకుప్పం గ్రామానికి చెందిన ఇంద్రకుమార్, మాయకృష్ణన్, కర్ణన్, శేఖర్లు చేపల వేట కోసం కొద్ది రోజుల కిందట సముద్రంలోకి వెళ్లారు.
నడి సముద్రంలో వారు విసిరిన వల బరువుగా అనిపించింది. దీంతో తమ వలకు భారీ చేప చిక్కిందని భావించారు. పైకి లాగే సరికి అందులో చేపకు బదులు మరేదో ఉండటంతో నిశితంగా గమనించారు. చివరకు అది తిమింగలం వాంతిగా గుర్తించి ఈ విషయం గురించి అరుచ్చిపాక్కం అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలోనే అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని దానిని స్వాధీనం చేసుకున్నారు. కాగా వారు ఆ పదార్థాన్ని పరిశీలించి దాని బరువు 38.6 కిలోలు ఉందని.. ధర రూ.50 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. అయితే తిమింగలం వాంతిని సముద్రంలో తేలే బంగారం అంటారు.
తిమింగలం వాంతికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అరుదైన స్పెర్మ్ తిమింగలాల పొట్టలో మాత్రమే ఇది తయారవుతుంది. ఆ తిమింగలాలు స్క్విడ్ అనే సముద్రపు జీవులను మింగుతాయి. అవి దాని పొట్టలోకి వెళ్లిన తర్వాత ఆంబ్రెయిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. దాంతో స్క్విడ్ లు ముక్కలై ముద్దలా మారిపోతాయి. ఆ సమయంలో తిమింగలం దాన్ని కక్కితే.. అదే వాంతిగా నీటిపై తేలుతుంది. నీటిలో ఉన్నా అది క్రమంగా గట్టిపడి కొవ్వొత్తిలా మారిపోతుంది. అలా మారిన దాన్ని అంబర్గ్రిస్ అంటారు. ఇక ఈ అంబర్గ్రిస్ సువాసన వెదజల్లుతుంది.
అందువల్ల దాన్ని పెర్ఫ్యూమ్ల తయారీలో వాడుతారు. సెంట్లు ఎక్కువ కాలం సుగంధ పరిమళాలు వెదజల్లాలంటే.. ఈ వాంతి అవసరం ఉంటుంది. ఈ వాంతిని కాల్చినప్పుడు ముందుగా చెడువాసన వస్తుంది. కాసేపటికి తియ్యటి వాసనగా అది మారుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి భారీ గిరాకీ ఉంది. ఈ వాంతి ఒక్కో కిలో రూ.30,50,620 దాకా ఉంటుంది. థాయ్లాండ్ సహా పలు దేశాలకు చెందిన మత్స్యకారులు తిమింగలం వాంతితో ఇప్పటికే కోటీశ్వరులు అయ్యారు. ఇలాంటి సంఘటనలు ఇది వరకు చోటు చేసుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా తమిళనాడుకు చెందిన జాలర్లకు తిమింగలం వాంతి లభించడం విశేషం.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…