SS Rajamouli : రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఈ కాంబినేషన్తో సినిమా నిర్మించడానికి నిర్మాత కె.ఎల్.నారాయణ ప్లాన్ చేశారు. ఇన్నాళ్లకు కానీ అది వాస్తవరూపం దాల్చలేదు. ఈ చిత్రం పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు వీరిద్దరి కాంబినేషన్లో ఈ చిత్రం పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. కథకు సంబంధించిన పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తికాగానే రాజమౌళితో మూవీ స్టార్ట్ చేస్తాడు మహేష్.
రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం రెండు కథలు సిద్ధం చేసినట్లు, అమెజాన్ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ, జేమ్స్బాండ్ తరహాలో యాక్షన్ అడ్వెంచర్ గా ఓ కథ అనుకున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి రాజమౌళి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తన తదుపరి సినిమా ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు.
మహేశ్తో చేసే సినిమా గ్లోబ్ట్రాటింగ్ అడ్వంచర్ అని చెప్పాడు. అంటే ప్రపంచాన్ని చుట్టివచ్చే ఒక సాహసవంతుని కథగా ఈ సినిమా ఉండబోతోందన్న మాట. గతంలో ఎంజీఆర్ లోకం చుట్టిన వీరుడు అనే సినిమా చేశారు. పక్కా యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా ఉంటుంది. ఇందులో మహేశ్ నుంచి ఎవరూ ఊహించని ఎలిమెంట్స్ ఉంటాయి అని రాజమౌళి చెప్పాడు.
రాజమౌళి సినిమా కోసం మహేశ్ కూడా ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తున్నాడు. ఆయనతో ఒక సినిమా చేస్తే 25 సినిమాలు చేసినట్లే అని ఓ ఇంటర్వ్యూలో మహేశ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక రాజమౌళితో సినిమా ప్రారంభమే కానీ ముగింపు ఎప్పుడో చెప్పలేము అనేదానిపై రకరకాల మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా మొత్తానికి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే చాలు అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…