SS Rajamouli : ఏపీలో గత కొద్ది నెలలుగా నెలకొన్న సినిమా టిక్కెట్ల ధరల విషయానికి గురువారంతో ఫుల్ స్టాప్ పడిందనే చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబులు సీఎం వైఎస్ జగన్ను కలిసి ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. అయితే జగన్తో సమావేశం అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీలో టిక్కెట్ల ధరలపై పది రోజుల్లో కొత్త జీవో వస్తుందని, అందరూ శుభవార్త వింటారని అన్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కానుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ వర్గాలు ఈ వార్తతో ఊపిరి పీల్చుకున్నాయి.
ఇక జగన్తో సమావేశం అనంతరం దర్శకుడు రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీకి చిరంజీవినే పెద్ద అని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. సినీ పరిశ్రమ అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, అవే సమస్యలను సీఎం జగన్కు వివరించామని అన్నారు. ఈ విషయంలో చిరంజీవి కృషి ఎంతో ఉందన్నారు. ఆయన అందరినీ సమన్వయం చేసి సమస్య పరిష్కారం అయ్యేలా చూశారని, కనుక ఇండస్ట్రీకి ఆయనే పెద్ద అని అన్నారు.
సీఎం జగన్తో చిరంజీవికి సాన్నిహిత్యం ఉందని, అందుకనే చిరంజీవి ఇంతలా శ్రమించి ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారం అయ్యేలా చేశారని.. అందుకు చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని.. రాజమౌళి అన్నారు. అయితే చిరంజీవి జగన్ను కలుస్తున్నందుకు గుర్రుగా ఉన్న మోహన్ బాబు వర్గీయులు ఇప్పుడు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…