SS Rajamouli : ఏపీలో గత కొద్ది నెలలుగా నెలకొన్న సినిమా టిక్కెట్ల ధరల విషయానికి గురువారంతో ఫుల్ స్టాప్ పడిందనే చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబులు సీఎం వైఎస్ జగన్ను కలిసి ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. అయితే జగన్తో సమావేశం అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీలో టిక్కెట్ల ధరలపై పది రోజుల్లో కొత్త జీవో వస్తుందని, అందరూ శుభవార్త వింటారని అన్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కానుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ వర్గాలు ఈ వార్తతో ఊపిరి పీల్చుకున్నాయి.
ఇక జగన్తో సమావేశం అనంతరం దర్శకుడు రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీకి చిరంజీవినే పెద్ద అని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. సినీ పరిశ్రమ అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, అవే సమస్యలను సీఎం జగన్కు వివరించామని అన్నారు. ఈ విషయంలో చిరంజీవి కృషి ఎంతో ఉందన్నారు. ఆయన అందరినీ సమన్వయం చేసి సమస్య పరిష్కారం అయ్యేలా చూశారని, కనుక ఇండస్ట్రీకి ఆయనే పెద్ద అని అన్నారు.
సీఎం జగన్తో చిరంజీవికి సాన్నిహిత్యం ఉందని, అందుకనే చిరంజీవి ఇంతలా శ్రమించి ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారం అయ్యేలా చేశారని.. అందుకు చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని.. రాజమౌళి అన్నారు. అయితే చిరంజీవి జగన్ను కలుస్తున్నందుకు గుర్రుగా ఉన్న మోహన్ బాబు వర్గీయులు ఇప్పుడు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…