Deepika Padukone : బాలీవుడ్ నటి దీపికా పదుకొనె పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన గెహ్రాయియా మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్లో నేరుగా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో అనన్య పాండే మరో కథానాయికగా నటించింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా దీపికా పదుకొనె తన మనసులో మాట చెప్పింది. తెలుగులో ఏ హీరోలతో యాక్ట్ చేసేందుకు ఇష్టపడతారు.. అని అడగ్గా.. అందుకు దీపికా సమాధానం చెప్పింది.
ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనతో కలసి నటించాలని ఉందని దీపికా పదుకొనె తెలియజేసింది. ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఫుటేజ్ చూశానని.. అద్భుతంగా యాక్ట్ చేశారని, అలాంటి నటుడితో నటించాలని ఎవరికైనా ఉంటుందని పేర్కొంది.
ఇక ఎన్టీఆర్ యాక్టింగ్ స్టైల్కు తాను ఫిదా అయ్యానని దీపికా తెలియజేసింది. అలాగే అల్లు అర్జున్ అంటే ఇష్టమని కూడా చెప్పింది. పుష్ప సినిమాలో ఆయన యాక్టింగ్ అద్భుతంగా ఉందని కితాబిచ్చింది. ఈ క్రమంలోనే తాను ఎన్టీఆర్, అల్లు అర్జున్లతో నటించాలని కోరుకుంటున్నానని తెలిపింది. ఇక దీపికా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్ కె అనే మూవీలో నటిస్తుండగా.. ప్రభాస్ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.
ప్రభాస్ ఒక ట్రూ జెంటిల్మన్ అని, ఆయన అందరితోనూ ఎంతో స్నేహంగా ఉంటారని చెప్పింది. ఆయన ప్రతి ఒక్కరినీ ఎంతో ప్రత్యేకంగా చూసుకుంటారని స్పష్టం చేసింది. ఆయన మర్యాదలకు తాను పడిపోయానని, ఆయన అతిథులుకు పెట్టే ఫుడ్ చాలా బాగుంటుందని, అందుకు తానే ఫిదా అయ్యానని.. దీపికా పదుకొనె తెలియజేసింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…