Sri Reddy : టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో శ్రీరెడ్డి ఒక్క సారిగా పాపులర్ అయింది. ఈమె ఫిలిం చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసింది. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఉలిక్కి పడ్డారు. తరువాత ఆమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కకుండా పోయాయి. అలాగే ఆ సంఘటన జరిగిన నాటి నుంచి శ్రీరెడ్డి సినీ, రాజకీయ ప్రముఖలపై సంచలన కామెంట్స్ చేస్తూనే వస్తోంది. ఈ క్రమంలోనే సమాజంలో జరిగే సంఘటనలపై కూడా ఆమె స్పందిస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తుంటుంది.
ఇక శ్రీరెడ్డికి తెలుగులో అవకాశాలు లేకపోయేసరికి చెన్నైకి మకాం మార్చింది. అక్కడి నుంచే ఆమె సోషల్ మీడియా ద్వారా తరచూ కనిపిస్తోంది. ఇక యూట్యూబ్లో అయితే శ్రీరెడ్డి చేస్తున్న రచ్చ మామూలుగా ఉండడం లేదు. ఆమెకు ఫేస్బుక్లో ఏకంగా 6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పెట్టే పోస్టులు కూడా వైరల్ అవుతుంటాయి. ఆమె వంటల వీడియోలను ప్రస్తుతం పోస్ట్ చేస్తూ అందరినీ అలరిస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల వంటలను శ్రీరెడ్డి వండి వడ్డించింది.
శ్రీరెడ్డి తాజాగా రొయ్యలు ములక్కాడల ఇగురు అనే వంటను వండింది. అలాగే మధ్య మధ్యలో పచ్చి బూతులను కూడా వాడింది. తనపై నెగెటివ్గా ఎవరైనా కామెంట్స్ చేస్తే.. వారి అంతు చూస్తా.. అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇక తరువాత తనదైన శైలిలో రొయ్యలను వండింది. వాటిని ఎలా వండితే బాగుంటాయో చెప్పింది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె వీడియోను ఎంతో మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…