Manchu Lakshmi : మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి నటిగా తనని ప్రూవ్ చేసుకోవాలని అప్పట్లో గట్టి ప్రయత్నాలే చేసింది. సొంత నిర్మాణంలో సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి హోస్ట్ గా మారి స్పెషల్ హోస్ చేసింది. మంచు లక్ష్మి హోస్ట్ గా లక్ష్మి టాక్ షో.. మేము సైతం షోలు ఆడియెన్స్ ని అలరించాయి. అవి పూర్తయ్యాక కేవలం సోషల్ మీడియా ద్వారా ఆడియెన్స్ కి టచ్ లో ఉంటోంది మంచు లక్ష్మి. తన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియాలో పెడుతూ అలరిస్తోంది మంచు వారి అమ్మాయి. ఫిట్ నెస్ స్టోరీస్ పేరిట.. తన కూరుతు నిర్వాణ గురించి సోషల్ మీడియాలో పెడుతూ వస్తోంది మంచు లక్ష్మి.
తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో రెగ్యులర్ చాట్స్ అయితే చాలా కామన్. ఇక ఇదిలా ఉండగా మంచు లక్ష్మి లేటెస్ట్ గా గాయాలతో ఉన్న ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేసింది. ముఖం మీద గాయాలు.. చేతికి బాగా దెబ్బ తగిలినట్టుగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది మంచు లక్ష్మి. అవి చూసి ఆమె ఫ్యాన్స్ అంతా కంగారు పడ్డారు. అయితే ఇందులో కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని, ప్రస్తుతం తాను చేస్తున్న సినిమా కోసం తాను వేసుకున్న మేకప్ అని చెప్పి షాక్ ఇచ్చింది మంచు లక్ష్మి. ఈ సోషల్ మీడియా వచ్చాక ఏది రియలో ఏదో అన్ రియలో అన్నది తెలియట్లేదు. అదీగాక ముందు గాయాల ఫోటో పెట్టి తూచ్ నాకేం కాలేదోచ్ అంటే ఎలా చెప్పండి.
ప్రస్తుతం మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం సినిమా చేస్తోంది. ఆ సినిమా కోసం ఆమె ఈవిధంగా మేకోవర్ అయ్యింది. మంచు మోహన్ బాబు తనయురాలిగా నటనలో తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది మంచు లక్ష్మి. అయితే ఆమెకు సరైన అవకాశాలు రావట్లేదని మాత్రం చెప్పొచ్చు. చాలా గ్యాప్ తర్వాత ఈ అగ్ని నక్షత్రం సినిమాలో నటిస్తోంది మంచు లక్ష్మి. ఈ సినిమాతో అయినా ఆమె కెరియర్ టర్న్ అవుతుందేమో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…