Manchu Lakshmi : మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి నటిగా తనని ప్రూవ్ చేసుకోవాలని అప్పట్లో గట్టి ప్రయత్నాలే చేసింది. సొంత నిర్మాణంలో సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి హోస్ట్ గా మారి స్పెషల్ హోస్ చేసింది. మంచు లక్ష్మి హోస్ట్ గా లక్ష్మి టాక్ షో.. మేము సైతం షోలు ఆడియెన్స్ ని అలరించాయి. అవి పూర్తయ్యాక కేవలం సోషల్ మీడియా ద్వారా ఆడియెన్స్ కి టచ్ లో ఉంటోంది మంచు లక్ష్మి. తన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియాలో పెడుతూ అలరిస్తోంది మంచు వారి అమ్మాయి. ఫిట్ నెస్ స్టోరీస్ పేరిట.. తన కూరుతు నిర్వాణ గురించి సోషల్ మీడియాలో పెడుతూ వస్తోంది మంచు లక్ష్మి.
తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో రెగ్యులర్ చాట్స్ అయితే చాలా కామన్. ఇక ఇదిలా ఉండగా మంచు లక్ష్మి లేటెస్ట్ గా గాయాలతో ఉన్న ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేసింది. ముఖం మీద గాయాలు.. చేతికి బాగా దెబ్బ తగిలినట్టుగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది మంచు లక్ష్మి. అవి చూసి ఆమె ఫ్యాన్స్ అంతా కంగారు పడ్డారు. అయితే ఇందులో కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని, ప్రస్తుతం తాను చేస్తున్న సినిమా కోసం తాను వేసుకున్న మేకప్ అని చెప్పి షాక్ ఇచ్చింది మంచు లక్ష్మి. ఈ సోషల్ మీడియా వచ్చాక ఏది రియలో ఏదో అన్ రియలో అన్నది తెలియట్లేదు. అదీగాక ముందు గాయాల ఫోటో పెట్టి తూచ్ నాకేం కాలేదోచ్ అంటే ఎలా చెప్పండి.
ప్రస్తుతం మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం సినిమా చేస్తోంది. ఆ సినిమా కోసం ఆమె ఈవిధంగా మేకోవర్ అయ్యింది. మంచు మోహన్ బాబు తనయురాలిగా నటనలో తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది మంచు లక్ష్మి. అయితే ఆమెకు సరైన అవకాశాలు రావట్లేదని మాత్రం చెప్పొచ్చు. చాలా గ్యాప్ తర్వాత ఈ అగ్ని నక్షత్రం సినిమాలో నటిస్తోంది మంచు లక్ష్మి. ఈ సినిమాతో అయినా ఆమె కెరియర్ టర్న్ అవుతుందేమో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…