Soundarya : బాల నటుడిగా కెరీర్ను ప్రారంభించి, హాస్య నటుడిగా రాణించి, కథానాయకుడిగా ఎదిగిన వ్యక్తి అలీ. ప్రస్తుతం తనదైన నటనతో నవ్వులు పంచుతూ ప్రేక్షకులను అల్లరిస్తున్నారు. అలీ కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం యమలీల. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పటిలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, నటుడిగా అలీ స్టార్డమ్ ను పెంచింది. ఈ చిత్రం సంగీత పరంగానూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.
1994 ఏప్రిల్ 28న విడుదలైన యమలీల ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భవిష్యవాణి చూసి తన తల్లి చనిపోతుందని తెలిసినప్పుడు అలీ నటనకు, హావభావాలు చూసి, ఆయనను కథానాయకుడిగా తీసుకోవద్దని చేపినవారు సైతం అలీ నటనకు హ్యాట్సాఫ్ చెప్పారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సౌందర్యను అనుకోవటం జరిగిందట. వెంటనే సౌందర్య వద్దకు వెళ్లి కథను వినిపించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కానీ కథలో హీరోగా అలీ నటిస్తున్నారని చెప్పగానే సౌందర్య సినిమా చేయనని చెప్పారట. సినీ కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో సౌందర్య తండ్రి వద్దని చెప్పడం వల్లే ఈ సినిమాకు సౌందర్య నో చెప్పారట.
దాంతో ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంద్రజ అవకాశాన్ని దక్కించుకున్నారు. 1994 ఎప్రిల్ 28న ప్రేక్షకుల మందుకు వచ్చిన యమలీల చిత్రం అలీ కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తరవాత అలీ శుభలగ్నం అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలోని డ్యూయెట్ చినుకు చినుకు అందెలతో పాట కోసం సౌందర్యను సంప్రదించారు దర్శక నిర్మాతలు. ఈసారి మాత్రం సౌందర్య ఎలాంటి సందేహం లేకుండా వెంటనే ఒప్పుకోవటం జరిగిందట. ఈ పాట అప్పటిలో మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…