Kantara Movie Kamala : శాండిల్ వుడ్ సత్తా ఏంటో మళ్లీ రుజువైంది. మొన్న కేజీఎఫ్, నిన్న విక్రాంత్ రోణ, నేడు కాంతారాతో కన్నడ చిత్రసీమ అందరూ అనుకుంటున్నట్టు వెనకబడి లేదని, కథల రూపకల్పనలో, వాటిని తెరకెక్కించడంలో ఇతర భాషలతో పోటీ పడుతోందని నిరూపిస్తోంది. మధ్యలో కొన్ని పాన్ ఇండియా కన్నడ చిత్రాలు పరాజయం పాలైనా, కేజీఎఫ్, కాంతారా చిత్రాల విజయంతో శాండిల్ వుడ్ మళ్లీ మారుమ్రోగి పోతుంది. ప్రముఖ దర్శకుడు రిషబ్ శెట్టి తానే ప్రధాన పాత్రను పోషించి, రూపొందించిన కాంతారా కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.
దీని తెలుగు వర్షన్ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ కూడా తిరుగులేని విజయాన్ని సాధించింది. అయితే కాంతారా సినిమాలో కమల పాత్రలో అమ్మ పాత్ర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. హీరో శివ తల్లి కమల పాత్ర నిజమైన పల్లెటూరి మహిళ. తన కొడుకు శ్రేయస్సు మరియు భద్రతను మాత్రమే కోరుకునే చిన్న ప్రపంచంలో జీవించే మహిళగా కమల కనిపించింది. అయితే ఈ పాత్రలో ఎవరు నటించారో తెలుసా..!? ఆమె.. మానసి సుధీర్ లాక్డౌన్ సమయంలో పిల్లల ప్రదర్శన పాటలు పాడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.
శివ తల్లి పాత్రలో మానసి సుధీర్ నటించింది. కమల పాత్రలో మానసి కనిపించగా, భర్తను కోల్పోయిన మహిళగా కనిపించింది. ఇటీవల సినిమాల్లో తల్లి పాత్ర ఎక్కువగా హైలైట్ అవుతుండగా ఇక్కడ కూడా తల్లి పాత్ర చాలా అందంగా కనిపిస్తుంది. డ్యాన్స్లో నిష్ణాతురాలైన ఆమె తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పిల్లలకు ఇష్టమైన వ్యక్తిగా మారింది. టీచర్ అయిన మానసి లాక్ డౌన్ సమయంలో పిల్లల పాటల ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. కాంతారా సినిమా బాక్సాఫీస్ హిట్ కావడంతో మానసి సుధీర్ కు రానున్న కాలంలో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మానసి వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించనుంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…