Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటోంది. మై మామ్ సెయిడ్ అంటూ అనేక కోట్స్ పోస్ట్ చేస్తోంది. మరోవైపు సినిమాల పరంగా కూడా ఆమె ఎంతో బిజీగా ఉంది. ఇక ఇటీవలే ఈమె తొలిసారిగా తన విడాకులపై స్పందించింది. ఈ క్రమంలోనే మరోమారు తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను వెల్లడించింది. ఈ ఏడాది తన జీవితంలో ఎంతో కష్టంగా గడిచిందని.. అత్యంత చేదు సంవత్సరం ఇదని, తన భవిష్యత్తుపై తాను ఓ దశలో ఆశలను వదులుకున్నానని తెలియజేసింది.
ఎన్నో ఏళ్లుగా కష్టపడి కెరీర్ను ఏర్పాటు చేసుకున్నానని సమంత తెలిపింది. 2021లో తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పలు సంఘటనల కారణంగా తన కలలు కల్లలు అయ్యాయని పేర్కొంది. దీంతో తాను ఎంతో కృంగిపోయానని, సోషల్ మీడియాతో సెలబ్రిటీలు ఫ్యాన్స్కు దగ్గరవుతారని చెప్రింది. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్ల ప్రేమ, అభిమానాలను పొందుతున్నానని చెప్పింది. వారు కూడా తన జీవితంలో భాగం అయ్యారని తెలియజేసింది.
అయితే కొందరు తనకు సపోర్ట్ను ఇస్తుంటే.. కొందరు మాత్రం తనను ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారని, కొందరు అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని చెబుతూ విచారం వ్యక్తం చేసింది. తనను విమర్శించే వాళ్లను ఒక్కటే కోరుతానని.. తాను చేసే ప్రతి పనినీ అంగీకరించాలని చెప్పింది. అయితే తన అభిప్రాయాలు అనేవి నచ్చకపోతే వాటిని ఒక రకంగా చెప్పవచ్చని, కానీ తనను తిట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ సంవత్సరంలో తన కలలు చెదిరిపోయానని, వచ్చే సంవత్సరంపై ఎలాంటి ఆశలు లేవని, నా జీవితంలో ఏది జరగాలని రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని సమంత తెలియజేసింది.
అయితే సమంత చెప్పిన విషయాలపై నటుడు సిద్ధార్థ్ పరోక్షంగా ఘాటుగా రిప్లై ఇచ్చారు. నేటి ప్రమాదరకరమైన సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు సెలబ్రిటీలు.. అభిమానుల గ్రూప్స్ నిర్వహించడానికి, వారిని ఆయుధాలుగా మార్చడానికి ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని, అయితే ఏదీ దానంతట అదే జరగదని, చివరికి తమ అభిమానులు తమనే కాటేస్తారనే విషయాన్ని హీరోహీరోయిన్లు అర్ధం చేసుకోవాల్సి ఉంటుందని.. అన్నాడు.
ఇక నుంచైనా.. ప్రేమని, ద్వేషాన్ని కొనుక్కోకండి.. అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో సమంతని ఉద్దేశించే సిద్దార్థ .. ఈ విధంగా కామెంట్స్ చేసి ఉంటాడని పలువురు అంటున్నారు. సమంత డబ్బులిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకుందని, ఇప్పుడు ఆ ఫ్యాన్సే ఆమెను విమర్శిస్తున్నారని.. సిద్ధార్థ్ పరోక్షంగా అన్నాడు. ఈ క్రమంలో వార్త చర్చనీయాంశంగా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…