తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఇండియా వ్యాప్తంగా ఢీ డాన్స్ షో కు ప్రత్యేక స్థానం ఉంది. ఒక డాన్స్ షో ఇన్ని సీజన్ లుగా కొనసాగడం ఒక రికార్డు అయితే.. ఇండియాలో ఇప్పటి వరకు ఏ డాన్స్ షో కు దక్కని రేటింగ్ లను రికార్డులను ఢీ డాన్స్ షో దక్కించుకుంటోంది. బుల్లితెరపై ప్రసారమవుతూ దూసుకుపోతున్న ఈ కార్యక్రమానికి ఎంతోమంది న్యాయ నిర్ణయితలుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న వారిలో హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ ఒకరు.
నాయికా.. ప్రతి నాయికా.. పాత్ర ఏంటి అనేది కాదు.. సినిమాలో ఆ పాత్ర ప్రాధాన్యమెంత అనేదే చూస్తుంది శ్రద్ధాదాస్. అందుకే గ్లామర్ రోల్స్కే పరిమితం కాకుండా నటిగా నిలబడింది. ఇన్నేళ్లయినా ఇంకా లైమ్ లైట్ లో ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఢీ డాన్స్ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి ఒక హీరోయిన్ న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తుండడంతో ఆమె రెమ్యూనరేషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు శ్రద్ధాదాస్ ఒక్కో ఎపిసోడ్ కు ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా కథనాల ప్రకారం శ్రద్ధాదాస్ ఒక్కో ఎపిసోడ్ కు సుమారుగా రూ.3.50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ షోకి సంబంధించి రెండు ఎపిసోడ్లకు ఒక రోజే షూటింగ్ జరుగుతుందని ఇలా ఆమె రెండు ఎపిసోడ్లకు రూ.7 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. వెండితెరపై ఈమెకు అవకాశాలు లేకపోయినా బుల్లితెరపై ఇలా పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తుందని, ఇలా బుల్లితెర అభిమానులను కూడా సంపాదించుకుంటోందని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా శ్రద్ధాదాస్ ఫ్యాన్స్ కి మాత్రం పండగే అని చెప్పవచ్చు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…