లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలే ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండేవి. వీటన్నింటికీ తెర దించుతూ ఎట్టకేలకు నయన్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుని అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టింది. కొన్ని రోజులు భర్తతో హనీమూన్ కి వెళ్లి వచ్చిన అనంతరం మళ్లీ షూటింగ్ లో బిజీ అయింది నయనతార.
అయితే ప్రస్తుతం నయన్ రెమ్యూనరేషన్ గురించి చర్చ జరుగుతోంది. బాలీవుడ్కి చెందిన దీపికా పదుకొనె, ఆలియా భట్లను అధిగమించి దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే సూపర్స్టార్ నటిగా ఆమె అవతరించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ జీ స్టూడియోస్ క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ శిష్యుడైన నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నయనతారతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రం కోసం నయనతార రూ.10 కోట్లను తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు దీపికా పదుకొనె, ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించవలసి వస్తే ఒక్కో ప్రాజెక్ట్కి రూ.8-10 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. కానీ నయనతార రూ.10 కోట్లు తీసుకొని వారి కంటే ముందుండడం గమనార్హం. మెగాస్టార్ చిరు గాడ్ ఫాదర్, ప్రేమమ్ దర్శకుడి తదుపరి చిత్రం గోల్డ్ వంటి తన కమర్షియల్ ప్రాజెక్ట్ల కోసం నయన్ రూ.4-5 కోట్ల వరకు వసూలు చేస్తుండగా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అంత మొత్తాన్ని డిమాండ్ చేస్తోంది.
నయన్ సక్సెస్ మూవీస్ తమిళ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.20 కోట్ల షేర్ ను వసూలు చేయడం, ఇతర హక్కులతో కలిపి నిర్మాతలు మరో రూ.20-30 కోట్లను సులభంగా పొందడంతో నయన్ అడిగిన మొత్తాన్ని ఇస్తున్నారట. ఒక హీరోయిన్ రూ.10 కోట్లు తీసుకోవడం అనేది గొప్ప విషయం. అందుకే అభిమానులు దట్ ఈజ్ నయన్ అని అభినందిస్తున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…