లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలే ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండేవి. వీటన్నింటికీ తెర దించుతూ ఎట్టకేలకు నయన్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుని అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టింది. కొన్ని రోజులు భర్తతో హనీమూన్ కి వెళ్లి వచ్చిన అనంతరం మళ్లీ షూటింగ్ లో బిజీ అయింది నయనతార.
అయితే ప్రస్తుతం నయన్ రెమ్యూనరేషన్ గురించి చర్చ జరుగుతోంది. బాలీవుడ్కి చెందిన దీపికా పదుకొనె, ఆలియా భట్లను అధిగమించి దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే సూపర్స్టార్ నటిగా ఆమె అవతరించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ జీ స్టూడియోస్ క్రియేటివ్ డైరెక్టర్ ఎస్ శంకర్ శిష్యుడైన నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నయనతారతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రం కోసం నయనతార రూ.10 కోట్లను తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు దీపికా పదుకొనె, ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించవలసి వస్తే ఒక్కో ప్రాజెక్ట్కి రూ.8-10 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. కానీ నయనతార రూ.10 కోట్లు తీసుకొని వారి కంటే ముందుండడం గమనార్హం. మెగాస్టార్ చిరు గాడ్ ఫాదర్, ప్రేమమ్ దర్శకుడి తదుపరి చిత్రం గోల్డ్ వంటి తన కమర్షియల్ ప్రాజెక్ట్ల కోసం నయన్ రూ.4-5 కోట్ల వరకు వసూలు చేస్తుండగా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అంత మొత్తాన్ని డిమాండ్ చేస్తోంది.
నయన్ సక్సెస్ మూవీస్ తమిళ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.20 కోట్ల షేర్ ను వసూలు చేయడం, ఇతర హక్కులతో కలిపి నిర్మాతలు మరో రూ.20-30 కోట్లను సులభంగా పొందడంతో నయన్ అడిగిన మొత్తాన్ని ఇస్తున్నారట. ఒక హీరోయిన్ రూ.10 కోట్లు తీసుకోవడం అనేది గొప్ప విషయం. అందుకే అభిమానులు దట్ ఈజ్ నయన్ అని అభినందిస్తున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…