గత కొంతకాలంగా టాలీవుడ్ లో సినిమాల కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీనికి తోడు యూనియన్ సమ్మె అని కొన్ని రోజులు, ఇప్పుడేమో నిర్మాతలు షూటింగ్ నిలిపివేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ శుక్రవారం విడుదలైన సీతారామం, బింబిసార బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రం మార్నింగ్ షో నుంచి సానుకూల మౌత్ టాక్ రావడంతో పాటు బి & సి సెంటర్లలో భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. ఈ తరుణంలో ఈ సినిమా నిజానికి మాస్ మాహారాజ్ రవితేజదేనని టాక్ వినిపిస్తోంది.
ఒకప్పుడు రవితేజ పోకిరి, పటాస్ వంటి చిత్రాలను తిరస్కరించాడు. రవితేజ వదులుకున్న చాలా సినిమాలు చివరికి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. మొదట దర్శకుడు వశిష్ట ఈ కథను రవితేజకు వివరించాడని, అయితే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం వల్ల అతని కెరీర్పై పెద్ద ప్రభావం పడుతుందని భావించిన మాస్ హీరోకి అది నచ్చలేదని సమాచారం. అంతేకాకుండా ఒక కొత్త దర్శకుడు భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఎపిసోడ్ లను ఎలా హ్యాండిల్ చేస్తాడో అని అనుమానంతో కూడా బింబిసారను రవితేజ వదులుకున్నాడట.
రవితేజ దానిని తిరస్కరించడంతో.. దర్శకుడు కళ్యాణ్రామ్ ను కలిశాడని, తన సొంత సంస్థ అన్ని విజువల్ ఎఫెక్ట్ లను నిర్వహించగలదని కళ్యాణ్ రామ్ నమ్మాడట. అలాగే బింబిసార పాత్ర చాలా ఆసక్తికరంగా ఉందనే నమ్మకంతో నందమూరి హీరో ఈ సినిమాను చేశాడు. స్క్రిప్ట్, దర్శకుడిపై కళ్యాణ్రామ్ కు ఉన్న నమ్మకం ఇప్పుడు వర్క్ అవుట్ అయినట్లు కలెక్షన్స్ ను చూస్తే అర్ధమవుతోంది. దీంతో రవితేజ మూవీ లిస్ట్ లో మరో సూపర్ హిట్ మిస్ అయ్యింది. ప్రస్తుతం రవితేజ వరుస పరాజయాలతో.. ఓ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…