ఆమని.. ఈ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడిపంబ సినిమాలో నరేష్ సరసన కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమని.. శుభలగ్నం, దొంగ వంటి చిత్రాలతో మెప్పించారు. హీరోయిన్ గా మంచి పాత్రలను చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ఇటీవల చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాల్లో నటించారు. ఇక బుల్లితెర మీద అటు రియాలిటీ షోకి అప్పుడప్పుడూ జడ్జిగా వ్యవహారిస్తున్న ఆమని క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించారు.
ఆమని తెలుగమ్మాయి అయినప్పటికీ తల్లిదండ్రులు బెంగళూరులో స్థిరపడటంతో అక్కడే పెరిగారు. తండ్రి డిస్ట్రిబ్యూటర్ అవ్వడంతో సినిమాల్లో నటించాలని ఆమని అనుకున్నారు. ఇక చెన్నై వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించింది. అవకాశాల కోసం వెళ్లిన మొదట్లో అడిషన్ కోసం వెళితే రేపు వచ్చి గెస్ట్ హౌస్ లో కలవమని చెప్పారట. అది కూడా ఒంటరిగా రమ్మనడంతో వాళ్ళు ఏ ఉదేశ్యంతో పిలుస్తున్నారో అర్థమైంది అని, అప్పట్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి పెదవి విప్పారు ఆమని. అయితే ఆమని అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా కూడా సినిమాలకు దూరం అవ్వలేదు.
బాపు, కే విశ్వనాథ్ వంటి లెజెండరీ డైరెక్టర్స్ చేత శభాష్ అనిపించుకున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి అనేక మంది ఇటీవల ధైర్యంగా ముందుకొచ్చి చెప్తున్నారు. తమిళనాట శరత్ కుమార్ కూతురు.. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్నట్లు తెలపడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇప్పటికైనా వీరు ఇలా బయటకొచ్చి నిజాలు చెప్పడం హర్షించదగ్గ విషయం అని అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…