Aryan Khan : డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) చేత అరెస్టు కాబడి ఆ తరువాత 20 రోజులకు పైగా జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు అక్టోబర్ 29వ తేదీన బెయిల్పై విడుదల అయ్యాడు. ఎంతో మంది సీనియర్ లాయర్లు కేసును వాదించినప్పటికీ బెయిల్ తేలేకపోయారు. దీంతో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కేవలం 2 రోజుల్లోనే ఆర్యన్ ఖాన్కు బెయిల్ వచ్చేలా చేశారు.
అయితే జైలు నుంచి విడుదల అయ్యాక ఆర్యన్ ఖాన్ పట్ల షారూఖ్ ఖాన్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. తన పర్సనల్ బాడీ గార్డ్ రవి సింగ్ను ఆర్యన్ ఖాన్కు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే షారూఖ్ తన కోసం ఇంకో కొత్త బాడీ గార్డ్ను నియమించుకునే పనిలో ఉన్నాడు.
ఇక ఆర్యన్ ఖాన్ వల్ల ఇప్పటికే చాలా రోజుల నుంచి షారూఖ్ తాను చేస్తున్న సినిమాల షూటింగ్కు వెళ్లడం లేదు. దీంతో ఎంతో షెడ్యూల్ వెనుకబడింది. అయితే ఆర్యన్ ఖాన్తో షారూఖ్ మరికొన్ని రోజులు ఇంట్లోనే గడపనున్నారు. ఈ క్రమంలోనే తాను చేస్తున్న సినిమాల షెడ్యూల్ను కొద్దిగా మార్చమని షారూఖ్ చిత్ర యూనిట్లను కోరారు.
తనకు సంబంధం లేని సీన్లను చిత్రీకరించేటప్పుడు తన అవసరం ఉండదు కనుక ఆ సమయంలో కచ్చితంగా ఆర్యన్తో ఉండాలని షారూఖ్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సీన్ల చిత్రీకరణ అందుకు తగిన విధంగా మార్చాలని కోరాడట. దీంతో ఎక్కువ సమయం పాటు ఫ్యామిలీతో.. ముఖ్యంగా ఆర్యన్తో గడిపే సమయం లభిస్తుంది.
ఇక షారూఖ్ సినిమాల విషయానికి వస్తే.. దీపికా పదుకునే, జాన్ అబ్రహామ్లతో కలిసి పఠాన్ అనే సినిమాలో షారూఖ్ నటిస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…