Aryan Khan : డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) చేత అరెస్టు కాబడి ఆ తరువాత 20 రోజులకు పైగా జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు అక్టోబర్ 29వ తేదీన బెయిల్పై విడుదల అయ్యాడు. ఎంతో మంది సీనియర్ లాయర్లు కేసును వాదించినప్పటికీ బెయిల్ తేలేకపోయారు. దీంతో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కేవలం 2 రోజుల్లోనే ఆర్యన్ ఖాన్కు బెయిల్ వచ్చేలా చేశారు.
అయితే జైలు నుంచి విడుదల అయ్యాక ఆర్యన్ ఖాన్ పట్ల షారూఖ్ ఖాన్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. తన పర్సనల్ బాడీ గార్డ్ రవి సింగ్ను ఆర్యన్ ఖాన్కు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే షారూఖ్ తన కోసం ఇంకో కొత్త బాడీ గార్డ్ను నియమించుకునే పనిలో ఉన్నాడు.
ఇక ఆర్యన్ ఖాన్ వల్ల ఇప్పటికే చాలా రోజుల నుంచి షారూఖ్ తాను చేస్తున్న సినిమాల షూటింగ్కు వెళ్లడం లేదు. దీంతో ఎంతో షెడ్యూల్ వెనుకబడింది. అయితే ఆర్యన్ ఖాన్తో షారూఖ్ మరికొన్ని రోజులు ఇంట్లోనే గడపనున్నారు. ఈ క్రమంలోనే తాను చేస్తున్న సినిమాల షెడ్యూల్ను కొద్దిగా మార్చమని షారూఖ్ చిత్ర యూనిట్లను కోరారు.
తనకు సంబంధం లేని సీన్లను చిత్రీకరించేటప్పుడు తన అవసరం ఉండదు కనుక ఆ సమయంలో కచ్చితంగా ఆర్యన్తో ఉండాలని షారూఖ్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సీన్ల చిత్రీకరణ అందుకు తగిన విధంగా మార్చాలని కోరాడట. దీంతో ఎక్కువ సమయం పాటు ఫ్యామిలీతో.. ముఖ్యంగా ఆర్యన్తో గడిపే సమయం లభిస్తుంది.
ఇక షారూఖ్ సినిమాల విషయానికి వస్తే.. దీపికా పదుకునే, జాన్ అబ్రహామ్లతో కలిసి పఠాన్ అనే సినిమాలో షారూఖ్ నటిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…