Viral News : పానీపూరీ అంటే చాలా మందికి ఇష్టమే. దీన్నే గోల్ గప్పా అని కూడా అంటారు. రహదారులపై మనకు ఎక్కడ చూసినా పానీ పూరీలను విక్రయిస్తుంటారు. ఓపిక ఉండాలే కానీ వీటిని ఇంట్లో కూడా చేసి తినవచ్చు. అయితే ఆ వ్యక్తి పానీ పూరీని తింటే ఏకంగా రూ.500 ఇస్తున్నాడు. అవును నిజమే.. కానీ అక్కడే ఒక మెలిక ఉంది. అదేమిటంటే..
ఆగ్రా – ఫిరోజాబాద్ హైవే పక్కన షలస్ అనే ఓ వ్యాపారి పానీపూరీలను విక్రయిస్తుంటాడు. అయితే తన వ్యాపారం ఇంకా ఎక్కువగా జరగడం కోసం అతనూ పానీపూరీ చాలెంజ్ను మొదలు పెట్టాడు. అందులో భాగంగా వినియోగదారులు అతను ఇచ్చే పానీపూరీని ఒకేసారి తినాల్సి ఉంటుంది. దీంతో రూ.500 గెలుచుకోవచ్చు.
అయితే ఆ పానీ పూరీ సాధారణ సైజులో ఉండదు, కొంచెం పెద్దగా ఉంటుంది. అయినప్పటికీ దాన్ని ఒకేసారి నోట్లో పెట్టుకుని మింగేయాలి. ఒక్క నీళ్ల చుక్క కూడా కిందపడరాదు. పడితే చాలెంజ్లో ఓడిపోయినట్లే. దీంతో షలస్కు రూ.100 ఇవ్వాలి. ఈ క్రమంలో చాలెంజ్లో గెలిస్తే రూ.500 అతను ఇస్తాడు.
అయితే ఇప్పటి వరకు ఈ చాలెంజ్లో ఎవరూ గెలవలేకపోయారు. అయినప్పటికీ ఆ చాలెంజ్ ను ట్రై చేసేందుకు చాలా మంది అతని వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అతని వ్యాపారం బాగానే కొనసాగుతోంది.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…