Samsung Galaxy A04s : ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తక్కువ బడ్జెట్లో మరొక నూతన స్మార్ట్ ఫోన్ను మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇక ఈ ఫోన్లో ఆక్టాకోర్ ఎగ్జినోస్ 850 ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్లో విడుదలైంది. ఈ ఫోన్లో మెమొరీని కార్డు ద్వారా పెంచుకోవచ్చు. 1టీబీ వరకు సపోర్ట్ చేస్తుంది.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఫోన్లో లభిస్తుంది. డ్యుయల్ సిమ్లను వేసుకోవచ్చు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా.. దీనికి తోడు మరో 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ను పక్క వైపున అందిస్తున్నారు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎ04ఎస్ స్మార్ట్ ఫోన్ బ్లాక్, గ్రీన్, కాపర్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. ధర రూ.13,499గా ఉంది. త్వరలోనే ఈ ఫోన్ను ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్స్లో విక్రయించనున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…