Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన సినిమా కెరీర్లో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించారు. ఆయన మళ్లీ గాఢ్ ఫాదర్ ద్వారా మనకు ముందుకు రానున్నారు. అయితే చిరంజీవి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చారు. కష్టంతో ఎదిగారు. మెగాస్టార్ అయ్యారు. ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. 50 ఏళ్ల ఆయన సినిమా కెరీర్లో ఎన్నో హిట్స్ ఉన్నాయి. ఇక రాజకీయాల్లోనూ చిరంజీవి గతంలో యాక్టివ్గా ఉన్నారు. కానీ అనుకున్న లక్ష్యం సాధించలేకపోయారు. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి 10 ఏళ్ల గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాల్లోకి వచ్చారు.
సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత చిరంజీవి చేసిన సినిమాల్లో కేవలం ఖైదీ నంబర్ 150 మాత్రమే ఆకట్టుకుంది. సైరా, ఆచార్య చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలోనే చిరంజీవి గాడ్ ఫాదర్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగుతున్న రోజుల్లో అనగా 1982 లో రెండు సార్లు ఆయన నటించిన రెండు సినిమాలు కూడా ఒకే రోజున విడుదల అయ్యాయి. 1982 జూలై 30వ తేదీన చిరంజీవి హీరోగా నటించిన సీతాదేవి, రాధా మై డార్లింగ్ సినిమాలు విడుదల అయ్యాయి. ఆ తర్వాత అక్టోబర్ 1వ తేదీన పట్నం వచ్చిన పతివ్రతలు, టింగు రంగడు సినిమాలు కూడా విడుదల అయ్యాయి.
కాగా పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాకు మౌళి దర్శకత్వం వహించారు. చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా నటించారు. వారి సరసన రాధిక, గీత నటించారు. అలాగే చిరంజీవి సోలో హీరోగా నటించిన టింగు రంగడు సినిమాలో కూడా హీరోయిన్ గా గీత చిరంజీవికి జోడీగా నటించింది. అయితే పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో చిరంజీవికి వదినగా నటించిన గీత ఆ సినిమాలో చిరంజీవితో కలిసి రొమాన్స్ చేసిందన్నమాట.
ఇక ఈ సినిమాకు టీఎల్వీ ప్రసాద్ దర్శకుడు కాగా.. ఒకే రోజు విడుదలైన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా వినోదాన్ని పంచింది. ఇక టింగు రంగడు సినిమా మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే అప్పట్లో ఇలా ఒకే రోజు రెండు సినిమాలను రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడది సాధ్యమయ్యే పని కాదని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…