Samantha Naga Chaithanya : అక్కినేని నాగ చైతన్య, సమంత వైవాహిక బంధంపై అక్టోబర్ 2న అఫీషియల్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మేము ఇద్దరం విడిపోతున్నాం. భవిష్యత్లో స్నేహితులుగా మాత్రమే ఉంటాం అని ప్రకటించారు. పదేళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నామని, అయితే విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉంటామని పేర్కొంది. కాగా 2017, అక్టోబర్ 7న సమంత – నాగ చైతన్య పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గోవాలో క్రిస్టియన్, హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నారు.
విడాకుల ప్రకటన తర్వాత సమంతనే అందరు ముద్దాయిగా చిత్రీకరిస్తూ విమర్శలు చేస్తున్నారు. సమంతకి ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఏవేవో పుకార్లు పుట్టించారు. వీటిపై సామ్ క్లారిటీ ఇచ్చినా కూడా ఆ పుకార్లు ఆగలేదు. తాజాగా సమంత, నాగచైతన్య విడాకులపై స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టులు చేశాడు.
‘కంగ్రాట్స్ స్లట్.. హీ ఈజ్ యువర్స్’ అని ప్రీతమ్ ఇన్ స్టా స్టోరీని షేర్ చేయగా, అది ఎవరిని ఉద్దేశించి చేసిందోననే చర్చ నడుస్తోంది. ఇక ‘అబద్ధాలు, రహస్యాలు బంధాలను నాశనం చేస్తాయి. ఎంత దాచిపెట్టినప్పటికీ ఏదో ఒక రోజు అవి బయటపడుతాయి’ అని ఇన్ స్టా స్టోరీలో పేర్కొన్నాడు. చైతూని ఉద్దేశించి ప్రీతమ్ ఇలాంటి కామెంట్స్ చేశాడా.. అని అందరూ చర్చించుకుంటున్నారు.
చైతూ వేరు అమ్మాయితో రిలేషన్లో ఉండడం వలననే సమంత విడాకులు ఇచ్చిందా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ స్టోరీలు పోస్టు చేసిన రెండు గంటల తర్వాత ప్రీతమ్ జుకల్కర్ వాటిని డిలీట్ చేయడం గమనార్హం. కాగా.. ఇటీవల ప్రీతమ్.. తాను సమంతను అక్కా అని పిలుస్తానని, తమ రిలేషన్ షిప్ ఏంటో నాగచైతన్యకు తెలుసని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రీతమ్ అలా పోస్టులను ఎందుకు డిలీట్ చేశాడనేది సందేహంగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…