Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో ఉంటూ అందరి కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు. కరోనా వైరస్ లాంటి మహమ్మారి విపత్తు సమయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఇరు రాష్ట్రాలకు ఎంతో సహాయం చేశారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలు అందించారు. ఈ సేవలను మరింత విస్తృతం చేసేందుకు రామ్ చరణ్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ ని లాంచ్ చేశారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్ ఆఫీసులో రామ్ చరణ్ ఈ వెబ్ సైట్ ని లాంచ్ చేశారు.
ఈ వెబ్ సైట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చిరంజీవి ట్రస్ట్ లో ఉన్న సేవల గురించి, బ్లడ్, ఐ బ్యాంకులో ఉన్న నిల్వల గురించి తెలుసుకొని సాయం పొందొచ్చు. డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని వచ్చి డొనేట్ చేయొచ్చు. ఎవరికైనా రక్త దానం, నేత్ర దానం కావాలన్నా ఇందులో రిక్వెస్ట్ పెడితే మేము త్వరగా రెస్పాండ్ అవుతాము. ప్రస్తుతం బ్లడ్, ఐ బ్యాంక్ మాత్రమే ఉంది. త్వరలో మిగిలిన అన్ని ఆర్గాన్స్ ని డొనేట్ చేసేలాగా అవయవ దానం కూడా మొదలు పెడతాము.. అని రామ్ చరణ్ తెలిపారు.
మేము చేసే సేవా కార్యక్రమాలకి ఎవరన్నా వాలంటీర్లుగా రావాలన్నా ఈ వెబ్ సైట్ లో అప్లై చేయొచ్చు.. అని తెలిపారు. 20 ఏళ్లుగా ఈ ట్రస్ట్ తరపున సేవ చేస్తున్నాము. ఇక ముందు కూడా చేస్తూ ఉంటాము.. అని తెలిపారు. మరోవైపు చిరంజీవి పర్సనల్ వెబ్ సైట్ ని కూడా లాంచ్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇందులో చిరంజీవి ఇప్పటిదాకా నటించిన సినిమాల వివరాలు, వాటికి సంబంధించిన ఫోటోలు, చిరంజీవి సినిమాల్లోని పాటలు, చిరంజీవి ఫోటోలు, అన్నీ అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…