Samantha : నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత కొంతకాలం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంది. వాళ్లిద్దరూ విడిపోయిన తరువాత ఆమె తన స్నేహితులతో కలసి కొన్ని విహార యాత్రలకు వెళ్లి దానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేసింది. కానీ కొంతకాలంగా సమంత ట్విట్టర్, ఇన్ స్టాగ్రమ్ లకు దూరంగా ఉంటూ వస్తుంది. తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లు ఇవ్వడం తప్ప తను నేరుగా సోషల్ మీడియాలో కనింపించి చాలా కాలం అయ్యింది. దీంతో తన లైఫ్ లో ఏవో ఇబ్బందులు ఉన్నాయని, తను ఏదో ఆపరేషన్ చేయించుకుందని ఇలా రకరకాల రూమర్లు చెక్కర్లు కొట్టాయి.
అయితే తను ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యిందని తెలుస్తుంది. 3 రోజుల క్రితం తన పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేసిన సమంత, దానికి ట్యాగ్ లైన్ గా , కింద పడినా ఇంకా ఔట్ కాలేదని రాసుకొచ్చింది. ఇక తాజాగా సమంత తన ఫోటోను కూడా ట్విట్టర్, ఇన్ స్టాగ్రమ్ లలో షేర్ చేసింది. ఈ ఫోటో లో ఆమె “ఇక నువ్వెప్పుడు ఒంటరిగా నడవవు” ( యు విల్ నెవర్ వాక్ అలోన్) అని రాసి ఉన్న టీ షర్ట్ ను ధరించింది. దీంతో ఆమె ఎవరితోనో రిలేషన్ లో ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఇంకా ట్విట్టర్ లో దర్శకుడు రాజమౌలి కొడుకు కార్తికేయ, ఈగ సినిమా గురించి వేసిన పోస్టుపై కూడా సమంత స్పందించింది. ఈ విధంగా తాను మళ్లీ ఫామ్ లోకి వచ్చానని , యాక్టివ్ అయ్యానని చెప్పకనే చెప్తుందని అంటున్నారు. అయితే సమంత తన చర్మానికి వైద్యం కోసం అమెరికా వెళ్లిందని కొందరు చెబుతుండగా ఆమె మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. కానీ ఆమె రీసెంట్ గా అమెరికా నుండి తిరిగి రావడం మాత్రం నిజమనే వినిపిస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె త్వరలో తాను విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొననుందని తెలిసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…