Samantha : నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత కొంతకాలం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంది. వాళ్లిద్దరూ విడిపోయిన తరువాత ఆమె తన స్నేహితులతో కలసి కొన్ని విహార యాత్రలకు వెళ్లి దానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేసింది. కానీ కొంతకాలంగా సమంత ట్విట్టర్, ఇన్ స్టాగ్రమ్ లకు దూరంగా ఉంటూ వస్తుంది. తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లు ఇవ్వడం తప్ప తను నేరుగా సోషల్ మీడియాలో కనింపించి చాలా కాలం అయ్యింది. దీంతో తన లైఫ్ లో ఏవో ఇబ్బందులు ఉన్నాయని, తను ఏదో ఆపరేషన్ చేయించుకుందని ఇలా రకరకాల రూమర్లు చెక్కర్లు కొట్టాయి.
అయితే తను ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యిందని తెలుస్తుంది. 3 రోజుల క్రితం తన పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేసిన సమంత, దానికి ట్యాగ్ లైన్ గా , కింద పడినా ఇంకా ఔట్ కాలేదని రాసుకొచ్చింది. ఇక తాజాగా సమంత తన ఫోటోను కూడా ట్విట్టర్, ఇన్ స్టాగ్రమ్ లలో షేర్ చేసింది. ఈ ఫోటో లో ఆమె “ఇక నువ్వెప్పుడు ఒంటరిగా నడవవు” ( యు విల్ నెవర్ వాక్ అలోన్) అని రాసి ఉన్న టీ షర్ట్ ను ధరించింది. దీంతో ఆమె ఎవరితోనో రిలేషన్ లో ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఇంకా ట్విట్టర్ లో దర్శకుడు రాజమౌలి కొడుకు కార్తికేయ, ఈగ సినిమా గురించి వేసిన పోస్టుపై కూడా సమంత స్పందించింది. ఈ విధంగా తాను మళ్లీ ఫామ్ లోకి వచ్చానని , యాక్టివ్ అయ్యానని చెప్పకనే చెప్తుందని అంటున్నారు. అయితే సమంత తన చర్మానికి వైద్యం కోసం అమెరికా వెళ్లిందని కొందరు చెబుతుండగా ఆమె మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. కానీ ఆమె రీసెంట్ గా అమెరికా నుండి తిరిగి రావడం మాత్రం నిజమనే వినిపిస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె త్వరలో తాను విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొననుందని తెలిసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…