Prabhas : ప్రభాస్ కి స్టార్ ఇమేజ్ లేదని ఆ సినిమా నుంచి తొలగించిన డైరెక్టర్.. ఎవరో తెలుసా..!

Prabhas : ఆరడుగుల కటౌట్ తో హీరో అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉంటుంది ప్రభాస్ లుక్. ఈశ్వర్ చిత్రంతో వెండితెరపైకి అడుగు పెట్టి అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.  ప్రభాస్ బిహేవియర్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరో అయినప్పటికీ కూడా సెట్స్ లో  అందరితో మంచిగా కలిసిపోతాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే మనస్తత్వం కలవాడు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన కూడా ప్రభాస్ ముఖంలో ఎప్పుడు కూడా కొంచమైనా గర్వం కనిపించలేదు. ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరిస్తాడు. అందుకే ప్రభాస్ ని ముద్దుగా ఇండస్ట్రీలో అందరూ డార్లింగ్ అని పిలుచుకుంటారు.

బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ కి నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఈ ఒక సినిమాతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్ర‌స్తుతం స‌లార్, ఆదిపురుష్ వంటి పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అంతే కాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ప్ర‌భాస్ ప‌క్క‌న ఒక్క సినిమాలోనైనా నటించే ఛాన్స్ వస్తే చాలనుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శక, నిర్మాత‌లు కూడా ప్ర‌భాస్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Prabhas

ఇంత స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోని ఒకప్పటి రోజుల్లో ఓ దర్శకుడు ప్రభాస్ కి స్టార్ డమ్ లేదని ఓ చిత్రం నుంచి తొలగించడం జరిగింది. ఆ సినిమా నుండి తొల‌గించినా కూడా ఆ సినిమా ఆడియో లాంఛ్ కు గెస్ట్ గా వెళ్లి చిత్ర‌యూనిట్ ను అభినందించాడు ప్రభాస్. ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే.. విక్టరీ వెంకటేష్, ఆసీన్  జంటగా నటించిన ఘర్షణ చిత్రం. 2004లో  విడుద‌లై ఈ సినిమా అప్పటిలో మంచి విజ‌యం సాధించింది. . పోలీస్ పాత్ర‌లో వెంక‌టేష్ చాలా అద్భుతంగా నటించారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే ఘర్షణ సినిమాకు మొద‌టగా ప్ర‌భాస్ ను హీరోగా ఎంపిక చేశారు. సినిమా ప్రారంభించడం కోసం పూజ‌కార్య‌క్ర‌మాలు కూడా నిర్వహించారు. కానీ అప్పటికే ఈశ్వర్, రాఘవేంద్ర చిత్రాలతో ప్లాప్స్ అందుకున్న ప్రభాస్ కు ప్రేక్షకులలో క్రేజ్ త‌క్కువ‌గా ఉంద‌న్న కార‌ణంతో దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రభాస్ ని ప‌క్క‌న పెట్టి వెంక‌టేష్ ను హీరోగా ఎంపిక చేశార‌ట‌.  ఇక ఈ సినిమా మిస్ చేసుకున్న‌ ప్ర‌భాస్ అదే ఏడాది వర్షం చిత్రంతో సక్సెస్ ను అందుకుని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఆనంద్‌ దేవరకొండ షేర్ చేసిన క్రేజీ వీడియో.. విజయ్, రష్మిక డ్యాన్స్‌ అదుర్స్!

నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…

Thursday, 12 March 2026, 12:11 PM

‘ఆ 100 విజయాలు వేస్ట్’.. వరల్డ్ కప్ గెలిచాక గంభీర్ స్పీచ్‌! సూర్యకుమార్ షాకింగ్ రివీల్.

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…

Thursday, 12 March 2026, 10:50 AM

ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి పోరులో ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…

Wednesday, 11 March 2026, 10:24 PM

విడాకులు తీసుకున్న హన్సిక.. పెళ్లయిన రెండేళ్లకే భర్తతో బంధం కట్! భరణం కూడా వద్దంటూ..

నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…

Wednesday, 11 March 2026, 9:27 PM

ఉద్రిక్తతల మధ్య క్షేమంగా చెన్నైకి అజిత్.. దుబాయ్ నుండి రాక.. వీడియో వైరల్!

ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెల‌కొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య త‌మిళ నటుడు…

Wednesday, 11 March 2026, 6:19 PM

వరల్డ్ కప్ నెగ్గిన ఆనందంలో అర్ష్‌దీప్‌కు ఐసీసీ షాక్.. ఫైనల్ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే?

టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…

Wednesday, 11 March 2026, 2:59 PM

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM