Rice Drink : స్థూలకాయం అనేక వ్యాధులకు మూలం, ఎందుకంటే దీని కారణంగా శరీరంలో అనేక వ్యాధులు అభివృద్ధి చెందుతాయి. సాధారణంగా ఆరోగ్య స్పృహ ఉన్నవారు స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి ఆహార నియమాలు పాటిస్తారు. ఈ కారణంగా స్థూలకాయాన్ని తగ్గించుకోవాలనుకుంటే ముందుగా ప్లేట్ నుండి అన్నం తీసేయండని కొందరు చెబుతుంటారు. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు అదనపు కొవ్వు బరువు పెరిగేందుకు కారణం అవుతుండగా.. దానిని తగ్గించుకునేందుకు అనేక మార్గాల్లో ట్రై చేస్తున్నారు చాలామంది.
ఇలా డైటింగ్ చేసే క్రమంలో బరువు తగ్గే వరకైనా అన్నం తినడం తగ్గించాలని సూచిస్తుంటారు. కానీ అన్నం లేకుండా ఉండలేమని ఆందోళన చెందుతుంటారు చాలామంది. అలాంటి వారికి రైస్ డ్రింక్ ఓ వరం లాంటిదని చెప్పాలి. ఎందుకంటే ఈ డ్రింక్ తాగితే అన్నం తిన్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా కొవ్వు కరుగుతుంది. ఇది పూర్తిగా ఇంట్లోనే తయారు చేసుకోగల డ్రింక్. రైస్ డ్రింక్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం. రైస్ డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాలు: బియ్యం రెండు టేబుల్ స్పూన్లు, నీరు తగినంత, జిలకర తగినంత, ఎండిన అల్లం పొడి తగినంత, మిరియాల పొడి తగినంత.
తయారు చేసే విధానం: జీరా, అల్లం పొడి, మిరియాల పొడులను సమాన భాగాల్లో తీసుకుని వాటిని మళ్లీ మిక్సీ పట్టి పొడిగా చేయాలి. ఈ పొడి నుంచి 1/4 టీస్పూన్ పొడిని తీసుకుని దాన్ని బియ్యానికి కలిపి ఈ మిశ్రమాన్ని మళ్లీ ఒక గ్లాస్ నీటికి కలపాలి. ఒక పాత్రలో ఈ మిక్స్ ను వేసి డికాషన్ లా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టి దానికి కొద్దిగా ఉప్పును కలిపి తీసుకోవాలి. బరువు తగ్గేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించే వారు దీన్ని తాగితే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరుగుతుంది. అంతేకాదు కొద్ది డ్రింక్ తోనే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఇది అధిక బరువు తగ్గించుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది.
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…