ANR : ఇప్పటి రోజుల్లో సినిమా తీయాలంటే ఒక సినిమాకి దాదాపు 500 కోట్లు ఖర్చు అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. మొన్నటికి మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం దాదాపు రూ. 400 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక రాబోతున్న ప్రభాస్ ఆది పురుష్ చిత్రానికి కూడా దాదాపు రూ.500 కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా భారీ బడ్జెట్ లతో నిర్మిస్తున్న సినిమాలలో స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ గా దాదాపు రూ.100 కోట్లు వరకు అందుకుంటారు.
కానీ అప్పటి తరం మన హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ప్రతి ఒక్కరూ స్వయంకృషితో పైకి వచ్చినవారే. నటనపై మక్కువతో ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. సినీ ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా నిలిచారు. 1980 కి ముందు చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది. ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో తెలుగు సినీ పరిశ్రమ తమిళనాడు నుంచి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులు జరిగాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ లో నిలబెట్టడం కోసం అప్పటి తరం స్టార్ హీరోలు ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ వంటి వారు ఎంతో గొప్ప కృషి చేశారు.
అప్పట్లో అగ్రస్థాయి హీరోలకి ఇప్పటి తరం హీరోలు మాదిరిగా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఉండేది కాదు. కేవలం ఎన్టీఆర్ చిత్రాలకు మాత్రమే రూ.40 లక్షల వరకు అధిక బడ్జెట్ ఉండేది. అంటే అప్పట్లో ఎన్టీఆర్ చిత్రాలు మాత్రమే అత్యధిక బడ్జెట్ చిత్రాలు. దక్షిణ భారతదేశం మొత్తంలో భారీ పారితోషికం అందుకొనే వారి లిస్ట్ లో ఎన్టీఆర్ ముందు ఉండేవారు. ఒక సినిమాకి రూ.40 లక్షల బడ్జెట్ ఉంటే ఎన్టీఆర్ కేవలం రూ.12 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేవారట.
ఆ తర్వాత ఏఎన్నార్ సినిమాలకు రూ. నుండి రూ.30 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట. ఏఎన్నార్ కూడా అప్పట్లో ఒక సినిమాకి రూ.10 లక్షలు తీసుకునేవారట. తర్వాత లిస్టులో మూడవ వారు కృష్ణ. కృష్ణ సినిమా బడ్జెట్ 20 నుంచి 25 లక్షల వరకు ఉంటే అందులో ఒక్క సినిమాకి రూ.7 లక్షల రెమ్యూనరేషన్ అందుకునేవారట. ఇక శోభన్ బాబు కూడా ఒక సినిమా బడ్జెట్ రూ.20 లక్షలు అయితే అందులో రూ.6 నుంచి రూ.7 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకునేవారట.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…