Samantha : అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు చెప్పినప్పటి నుంచి సమంత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. అలాగే పలు బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తోంది. దీంతోపాటు సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోషూట్స్ను పోస్ట్ చేస్తోంది. పలు మ్యాగజైన్లకు చెందిన కవర్ ఫొటోలకు పోజులు కూడా ఇస్తోంది. అయితే సమంత ఈ మధ్య కాలంలో చీటికీ మాటికీ ముంబై వెళ్తోంది. హైదరాబాద్కు రావడం.. షూటింగ్ చేయడం.. పని అవగానే ముంబై వెళ్లడం.. ఇదీ సమంత చేస్తున్న పని. అయితే ఇలా సమంత మాటిమాటికీ ముంబై ఎందుకు వెళ్తోంది.. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి.. అన్న విషయానికి వస్తే..
హైదరాబాద్లో నాగచైతన్య ఉంటాడు కదా.. అలాగే ఇక్కడ ఉండడం వల్ల మీడియాకు కూడా ఎదురు పడాల్సి వస్తోంది. దీంతో వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నదట. నాగచైతన్య ఉండేది హైదరాబాద్లోనే కనుక.. ఆమెకు ఇంకా పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. కనుక వాటి నుంచి బయట పడేందుకే సమంత ముంబైలో నివసిస్తుందని తెలుస్తోంది. అలాగే అక్కడ ఆమెకు పలు ఆఫర్లు కూడా వస్తున్నాయట. కనుక కేవలం పని ఉన్నప్పుడే హైదరాబాద్కు వచ్చి వెళ్తోంది. పూర్తి స్థాయిలో ఆమె ముంబైలోనే ఉంటోంది.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఈమె విజయ్ దేవరకొండతో కలసి నటిస్తున్న ఖుషి మూవీ తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. కాశ్మీర్లో షూటింగ్ చేశారు. అలాగే సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద మూవీ ఆగస్టులో విడుదల కానుంది. దీంతోపాటు ఓ సిరీస్లోనూ ఈమె నటిస్తుందని తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…