Viral Video : కృషి, పట్టుదల ఉండాలే కానీ.. మన శారీరక వైకల్యం దేనికీ అడ్డుకాదు. మనసులో సంకల్పం ఉండాలి. ఏదో సాధించాలన్న తపన ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం ఉంటే జీవితంలో ఎవరైనా సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. తమ మార్గంలో ఎన్ని ముళ్ల కంచెలు ఉన్నా సరే లెక్క చేయరు. ముందుకే సాగుతుంటారు. అవును.. ఈ సూత్రాలను బాగానే వంట బట్టించుకుంది. కాబట్టే ఆ బాలిక తనకు శారీరక వైకల్యం ఉన్నప్పటికీ ఏమాత్రం దాన్ని లెక్క చేయకుండా ముందుకే సాగుతోంది. కష్టపడి విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. దీంతో అందరి నుంచి ఆమె ప్రశంసలను అందుకుంటోంది. ఇక అసలు విషయం ఏమిటి ? అని వివరాల్లోకి వెళితే..
బీహార్లోని ఫతేపూర్కు చెందిన సీమా అనే బాలిక వయస్సు 10 ఏళ్లు. ఈమెకు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలు పూర్తిగా పోయింది. అయినప్పటికీ ఈమె ఏమాత్రం భయపడలేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. ఒంటికాలిపైనే స్కూల్కు రోజూ నడిచివెళ్తూ విద్యాభ్యాసం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె రోజుకు కిలోమీటర్ దూరం పాటు ఒంటికాలిపైనే నడిచి వెళ్తోంది. అయితే ఈమెను వీడియో తీసి ఈమె సమస్య గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈమెకు సహాయం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు.
సీమాకు ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్ ఓ ట్రైసైకిల్ ను అందజేశారు. దీంతో ఆమె ఆ ట్రై సైకిల్పై స్కూల్కు వెళ్తోంది. ఇక సీమా గురించి నటుడు సోనూసూద్కు కూడా విషయం తెలిసింది. దీంతో ఆయన కూడా సీమాకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇలా సోషల్ మీడియా ద్వారా సీమా గురించి చాలా మంది తెలుసుకుని ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఏదో ఒక రోజు తాను అనుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తుందని అందరూ అంటున్నారు. కాగా సీమా స్కూల్కు వెళ్తున్న వీడియో వైరల్గా మారింది.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…