Samantha : ప్రస్తుత తరుణంలో సమంత పేరు సోషల్ మీడియాలో, వార్తల్లో మారుమోగిపోతోంది. ఈమె ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించిన కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొని తన వైవాహిక జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది. అలాగే సినిమాల గురించి కూడా చెప్పింది. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలే దుమారం రేపుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొన్న సమంత అందులో కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. మీరు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్ అయ్యారట కదా.. అని అడగ్గా.. అందుకు ఆమె నవ్వుతూ బదులిస్తూ.. అవును.. నేను డబ్బులిచ్చి నంబర్ వన్ హీరోయిన్ అయ్యా.. అని బదులు చెప్పింది. అయితే ఆమె నిజంగానే ఓర్ మాక్స్ అనే సంస్థ ఇచ్చిన రేటింగ్స్లో నంబర్ వన్ హీరోయిన్గా నిలిచింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆమె నిజంగానే ఇందుకు గాను డబ్బులు ఇచ్చిందా.. అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఆమె షోలో యాదృచ్చికంగానే అలా అని ఉంటుందని.. ఆమె నంబర్ వన్ అవడం ఆమెకు ముందుగా తెలియకపోవచ్చని.. అంటున్నారు.
ఇక సమంత కరణ్ జోహార్ షోలో మాట్లాడుతూ.. తన భర్త చైతూను మాజీ భర్త అని సంబోధించాలని చెప్పింది. దీంతో కరణ్ జోహార్ సారీ కూడా చెప్పారు. అయితే ఇందుకు అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత మరీ విడ్డూరంగా ప్రవర్తిస్తుందని.. కానీ ఆమె గురించి చైతూ మాత్రం చాలా కూల్గానే బదులిస్తున్నాడని.. ఆయనకు, ఆమెకు ఎంతో తేడా ఉందని అంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. శాకుంతలం, యశోద, ఖుషితోపాటు తెలుగు, తమిళంలోనూ ఓ బైలింగ్వల్ మూవీలో నటిస్తోంది. అలాగే హిందీలోకి ఎంట్రీ ఇస్తూ ఆయుష్మాన్ ఖురానాతో ఓ చిత్రానికి ఓకే చెప్పింది. అలాగే అక్షయ్ కుమార్తోనే మరో సినిమాకి కన్ఫమ్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీని మైథలాజికల్ స్టోరీగా తెరకెక్కించనున్నారని సమాచారం. దీంతోపాటు మరో అంతర్జాతీయ మూవీలోనూ సమంత నటిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…