Samantha : ప్రస్తుత తరుణంలో సమంత పేరు సోషల్ మీడియాలో, వార్తల్లో మారుమోగిపోతోంది. ఈమె ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించిన కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొని తన వైవాహిక జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది. అలాగే సినిమాల గురించి కూడా చెప్పింది. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలే దుమారం రేపుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొన్న సమంత అందులో కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. మీరు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్ అయ్యారట కదా.. అని అడగ్గా.. అందుకు ఆమె నవ్వుతూ బదులిస్తూ.. అవును.. నేను డబ్బులిచ్చి నంబర్ వన్ హీరోయిన్ అయ్యా.. అని బదులు చెప్పింది. అయితే ఆమె నిజంగానే ఓర్ మాక్స్ అనే సంస్థ ఇచ్చిన రేటింగ్స్లో నంబర్ వన్ హీరోయిన్గా నిలిచింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆమె నిజంగానే ఇందుకు గాను డబ్బులు ఇచ్చిందా.. అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఆమె షోలో యాదృచ్చికంగానే అలా అని ఉంటుందని.. ఆమె నంబర్ వన్ అవడం ఆమెకు ముందుగా తెలియకపోవచ్చని.. అంటున్నారు.
ఇక సమంత కరణ్ జోహార్ షోలో మాట్లాడుతూ.. తన భర్త చైతూను మాజీ భర్త అని సంబోధించాలని చెప్పింది. దీంతో కరణ్ జోహార్ సారీ కూడా చెప్పారు. అయితే ఇందుకు అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత మరీ విడ్డూరంగా ప్రవర్తిస్తుందని.. కానీ ఆమె గురించి చైతూ మాత్రం చాలా కూల్గానే బదులిస్తున్నాడని.. ఆయనకు, ఆమెకు ఎంతో తేడా ఉందని అంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. శాకుంతలం, యశోద, ఖుషితోపాటు తెలుగు, తమిళంలోనూ ఓ బైలింగ్వల్ మూవీలో నటిస్తోంది. అలాగే హిందీలోకి ఎంట్రీ ఇస్తూ ఆయుష్మాన్ ఖురానాతో ఓ చిత్రానికి ఓకే చెప్పింది. అలాగే అక్షయ్ కుమార్తోనే మరో సినిమాకి కన్ఫమ్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీని మైథలాజికల్ స్టోరీగా తెరకెక్కించనున్నారని సమాచారం. దీంతోపాటు మరో అంతర్జాతీయ మూవీలోనూ సమంత నటిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…