Rajinikanth : తమిళ నటుడు అయినప్పటికీ రజనీకాంత్ గ్లోబల్ స్టార్ అన్న విషయం విదితమే. ఈయన సినిమాలు జపాన్ వంటి దేశాల్లోనూ ప్రదర్శితమవుతుంటాయి. అందుకనే ఆయన అందరికీ పరిచయం అయ్యారు. ఇక రజనీకాంత్ ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉంటారు. అందుకనే ఆయన తరచూ హిమాలయాలకు వెళ్తుంటారు. ఇక ఈ మధ్యే ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. తన జీవితంలో ఎన్నో అనుభవించానని చెప్పిన ఆయన.. తనకు ప్రశాంతత మాత్రం కరువైందని అన్నారు. అలాగే ఆనందం అనేది లేకుండా పోయిందని తెలిపారు.
జీవితంలో తాను ఎంతగానో పేరు, ప్రఖ్యాతులను సాధించానని రజనీకాంత్ తెలిపారు. అలాగే ఎంతో డబ్బు సంపాదించానన్నారు. కానీ తనకు ఆనందం, ప్రశాంతత అనే రెండు లభించడం లేదన్నారు. అవి మనుషులకు దొరకడం అసంభవం అని ఆయన వైరాగ్యపు మాటలు మాట్లాడారు. తాను హిమాలయాలకు వెళ్తుంటే కాసేపు ఆత్మ సంతృప్తి లభిస్తుందన్నారు. కానీ అది తాత్కాలికమేనని.. ఆనందం, ప్రశాంతత అనేవి ఎల్లప్పుడూ ఉండవని అన్నారు. అయితే తన ప్రవర్తన చూసి కొందరు సన్యాసులు అయితే.. కొందరు తరచూ హిమాలయాలకు వెళ్తున్నారని అన్నారు.
ఇక రజనీకాంత్ ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్ లను ఎదుర్కొంటున్నారు. ఆయన నటించిన 2.0 తరువాత ఏ మూవీ కూడా హిట్ కాలేదు. ఈ క్రమంలోనే రజనీ కెరీర్ ఇక ముగిసినట్లేనని అంటున్నారు. ఇక ఆయన ప్రస్తుతం జైలర్ అనే మూవీలో నటిస్తున్నారు. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే రజనీకాంత్ ఆ స్థాయిలో ఉండి కూడా ఇలా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయనకు ఏయే విషయాల్లో ఆనందం, ప్రశాంతత లేవు.. అని అందరూ చర్చించుకుంటున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…