IND Vs WI : పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లోనూ భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ క్రమంలో 3 వన్డేల సిరీస్ను కైవసం చేసుకుంది. సిరీస్లో 2-0 ఆధిక్యంలో ఉంది. వెస్టిండీస్ నిర్దేశించిన 312 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్లు కోల్పోయినప్పటికీ ఛేదించింది. దీంతో విండీస్పై భారత్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 311 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్మెన్లలో షై హోప్ 135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు చేయగా, నికోలాస్ పూరన్ 77 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే దీపక్ హుడా, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్లను కోల్పోయి 312 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో అక్షర్ పటేల్ (64 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (63), సంజు శాంసన్ (54), శుబమన్ గిల్ (43)లు ఆకట్టుకున్నారు. విండీస్ బౌలర్లలో అల్జరి జోసెఫ్, కైలీ మయర్స్లు చెరో 2 వికెట్లు తీశారు. జేడెన్ సీల్స్, రొమారియో షెఫర్డ్, అకియల్ హోసెయిన్లకు తలా 1 వికెట్ దక్కింది. ఈ క్రమంలోనే సిరీస్లో చివరిదైన మూడో వన్డే ఈ నెల 27వ తేదీన ఇదే వేదికగా జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…