IND Vs WI : పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లోనూ భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ క్రమంలో 3 వన్డేల సిరీస్ను కైవసం చేసుకుంది. సిరీస్లో 2-0 ఆధిక్యంలో ఉంది. వెస్టిండీస్ నిర్దేశించిన 312 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్లు కోల్పోయినప్పటికీ ఛేదించింది. దీంతో విండీస్పై భారత్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 311 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్మెన్లలో షై హోప్ 135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు చేయగా, నికోలాస్ పూరన్ 77 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే దీపక్ హుడా, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్లను కోల్పోయి 312 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో అక్షర్ పటేల్ (64 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (63), సంజు శాంసన్ (54), శుబమన్ గిల్ (43)లు ఆకట్టుకున్నారు. విండీస్ బౌలర్లలో అల్జరి జోసెఫ్, కైలీ మయర్స్లు చెరో 2 వికెట్లు తీశారు. జేడెన్ సీల్స్, రొమారియో షెఫర్డ్, అకియల్ హోసెయిన్లకు తలా 1 వికెట్ దక్కింది. ఈ క్రమంలోనే సిరీస్లో చివరిదైన మూడో వన్డే ఈ నెల 27వ తేదీన ఇదే వేదికగా జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…