Today Gold Rates : అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతోపాటు మన దేశంలో పలు పన్నుల కారణంగా గత కొంత కాలంగా బంగారం ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. ఒకసారి భారీగా ధర పెరిగితే మరోసారి ధర తగ్గుతోంది. దీంతో ఎప్పుడు బంగారం ధరలు ఎలా ఉంటున్నాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇక ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలోనే సోమవారం (25-07-2022) బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సోమవారం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది. కాగా బంగారం ధర గత రెండు రోజుల్లో రూ.1000 పెరిగింది. వెండి రేటు కూడా స్థిరంగానే ఉంది. ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.61,200 గా ఉంది. ఆదివారం వెండి ధర రూ.400 పడిపోయింది. గత వారం రోజుల్లో బంగారం ధరలు కాస్త ఉపశమనం లభించేవిగా ఉంటున్నాయి. హైదరాబాద్ లో సోమవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.51,160గా ఉంది. అలాగే వెండి రేటు 1 కిలోకు రూ.61,200గా ఉంది.
విజయవాడ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది. వెండి ధర రూ.61,200గా ఉంది. ఏపీలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇలాగే ధరలున్నాయి. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 46,900గా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.51,160గా ఉంది. ఢిల్లీలో వెండి రేటు 1 కిలోకు రూ.55,100గా ఉండగా, ఆర్థిక రాజధాని ముంబై, కోల్ కతాలోనూ ఇవే ధరలు ఉన్నాయి. వెండి ధరల్లో ఆదివారంతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. అలాగే మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.61,200 గా ఉంది. చెన్నై, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.61,200 ఉండగా, ముంబై, కోల్కతా, ఢిల్లీలలో వెండి ధర కిలోకు రూ. 55,100గా కొనసాగుతోంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…