Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించి టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఎదిగింది. కెరీర్ పీక్స్లో దూసుకుపోతున్న సమంతకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుంచి సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సమంత పూర్తిగా కోలుకుంది. కోలుకున్న తర్వాత సమంత తన పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసే పనిలో పడింది. ఇటీవల శాకుంతలం ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా పాల్గోన్న సమంత ఇప్పుడు విజయ్ దేవరకొండ ఖుషి.. వరుణ్ ధావన్ సరసన నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ పూర్తి చేయాలని అనుకుంటుంది.
సిటాడెల్ ప్రాజెక్ట్ని ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్- డీకేనే ఈ సిరీస్ ని కూడా తెరకెక్కిస్తున్నారు. సమంత షూటింగ్ లో పాల్గొన్న విషయాన్ని వారి సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేస్తూ.. “ఈ పవర్ హౌస్ మరోసారి పనిచేయడానికి ఎంతో ఎక్జైటెడ్ గా ఉన్నాం. సిటాడెల్ ప్రపంచానికి స్వాగతం సమంత” అంటూ రాజ్- డీకే.. సమంత ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో సమంత లుక్ అదిరిపోయింది. హాలీవుడ్ లో రూసో బ్రదర్స్ నుంచి రాబోతున్న అతిపెద్ద టీవీ సిరీస్ ఇదే అవుతుందని, దీనితో సమంతకి మంచి పేరు వస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.
మరోవైపు విజయ్, సమంత కాంబోలో తెరకెక్కుతున్న ఖుషి కోసం తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఖుషికి ప్రయారిటీ ఇవ్వకుండా సిటాడెల్ గురించి ప్రకటించడం విజయ్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. దీనితో ఓ అభిమాని ఖుషి సంగతి ఏంటి అంటూ ప్రశ్నించాడు. ఖుషి చిత్రాన్ని కూడా త్వరలోనే తిరిగి ప్రారంభిస్తాం.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నన్ను క్షమించండి అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి విజయ్ దేవరకొండ స్పందించాడు. చిరునవ్వుతో పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని మేమంతా ఎదురుచూస్తున్నాం అంటూ విజయ్ పోస్ట్ పెట్టారు. సమంత సిటాడెల్ కి బల్క్ అమౌంట్ లో డేట్స్ కేటాయించిన నేపథ్యంలో ఖుషీ ప్రాజెక్ట్ లో జాయిన్ కావాలంటే కొంత సమయం పట్టేలా కనిపిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…