Lalitha Jewellers : లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ని చూస్తే డబ్బులు ఊరికే రావు అనే డైలాగ్ వెంటనే గుర్తుకు వస్తుంది. ఎలాంటి సెలబ్రిటీ సాయం తీసుకోకుండా తన కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ అందరిని ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాడు కిరణ్ కుమార్. చిత్తూరు నగరంలోని వేలూరు రోడ్డు చామంతి పురం లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యువలరీ షోరూంను క్రీడా శాఖ మంత్రి రోజా బుధవారం ఉదయం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లలిత జ్యువలరీ తో తనకు ఉన్న అనుబంధం మరువలేనిదని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు అప్పుడు లలిత జ్యువెలరీ లోనే నగలు కొనుగోలు చేసే వారిని, అధినేత కిరణ్ కుమార్ అతి తక్కువ ధరలకు నాణ్యమైన నగలను అందించే వారని రోజా తెలిపారు. ఇప్పటిదాకా 45 బ్రాంచీలను ఓపెన్ చేసి.. జనాలకు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడదే వ్యక్తి తాజాగా చిత్తూరులో 46వ బ్రాంచ్ ఓపెన్ చేశాడు. రోజాతో రిబ్బన్ కట్ చేయించి కొత్త షోరూం ఓపెన్ చేసిన కిర్ణ కుమార్ మాట్లాడుతూ.. పిలవగానే వచ్చినందుకు రోజా గారికి థ్యాంక్స్. రీసెంట్ గా మా టీంతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి ఓపెనింగ్ కి రావాలని ఆహ్వానించాం . ఆ సమయంలో మాకు భోజనం పెట్టి మరీ మాకు మర్యాదలు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మనం అనుకున్న గెస్ట్ వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది” అంటూ రోజాని కొనియాడాడు.
గ్రీన్ అంబాసిడర్ గా రోజాను నియమిస్తారా అని కిరణ్ కుమార్ ను విలేకరులు అడగగా, ఆ ప్రశ్నకు రోజా స్పందిస్తూ కిరణ్ కుమార్ ఒక అంబాసిడర్ అని ప్రజల మధ్య అతనికి ఉన్న క్రేజ్ తో లలిత జ్యువెలర్స్ ఫేమస్ అయింది అన్నారు.అనంతరం లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ మాట్లాడుతూ సోదరి సమానురాలైన రోజాతో తనకున్న అనుబంధం గొప్పదని, పిలవగానే ప్రారంభానికి వచ్చిన రోజాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక రోజాపై ప్రశంసలు కురిపిస్తూ లలితా జ్యువలరీ ఓనర్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…