Lalitha Jewellers : లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ని చూస్తే డబ్బులు ఊరికే రావు అనే డైలాగ్ వెంటనే గుర్తుకు వస్తుంది. ఎలాంటి సెలబ్రిటీ సాయం తీసుకోకుండా తన కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ అందరిని ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాడు కిరణ్ కుమార్. చిత్తూరు నగరంలోని వేలూరు రోడ్డు చామంతి పురం లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యువలరీ షోరూంను క్రీడా శాఖ మంత్రి రోజా బుధవారం ఉదయం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లలిత జ్యువలరీ తో తనకు ఉన్న అనుబంధం మరువలేనిదని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు అప్పుడు లలిత జ్యువెలరీ లోనే నగలు కొనుగోలు చేసే వారిని, అధినేత కిరణ్ కుమార్ అతి తక్కువ ధరలకు నాణ్యమైన నగలను అందించే వారని రోజా తెలిపారు. ఇప్పటిదాకా 45 బ్రాంచీలను ఓపెన్ చేసి.. జనాలకు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడదే వ్యక్తి తాజాగా చిత్తూరులో 46వ బ్రాంచ్ ఓపెన్ చేశాడు. రోజాతో రిబ్బన్ కట్ చేయించి కొత్త షోరూం ఓపెన్ చేసిన కిర్ణ కుమార్ మాట్లాడుతూ.. పిలవగానే వచ్చినందుకు రోజా గారికి థ్యాంక్స్. రీసెంట్ గా మా టీంతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి ఓపెనింగ్ కి రావాలని ఆహ్వానించాం . ఆ సమయంలో మాకు భోజనం పెట్టి మరీ మాకు మర్యాదలు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మనం అనుకున్న గెస్ట్ వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది” అంటూ రోజాని కొనియాడాడు.
గ్రీన్ అంబాసిడర్ గా రోజాను నియమిస్తారా అని కిరణ్ కుమార్ ను విలేకరులు అడగగా, ఆ ప్రశ్నకు రోజా స్పందిస్తూ కిరణ్ కుమార్ ఒక అంబాసిడర్ అని ప్రజల మధ్య అతనికి ఉన్న క్రేజ్ తో లలిత జ్యువెలర్స్ ఫేమస్ అయింది అన్నారు.అనంతరం లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ మాట్లాడుతూ సోదరి సమానురాలైన రోజాతో తనకున్న అనుబంధం గొప్పదని, పిలవగానే ప్రారంభానికి వచ్చిన రోజాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక రోజాపై ప్రశంసలు కురిపిస్తూ లలితా జ్యువలరీ ఓనర్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…