Bigg Boss : ఏ మాయ చేసావే సినిమాలో జంటగా నటించి నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చైసామ్ అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరి విడాకుల వార్తను సామ్ అభిమానులతోపాటు చైతూ అభిమానులు కూడా జీర్ణచుకోలేకపోయారు. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అభిమానులు భావిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది.
వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు కానీ ఎక్కడ చూసినా వీరి టాపిక్ నడుస్తుంది. వీరిద్దరి విడాకులకు కారణం ఇదే అంటూ రోజుకొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు వీరిద్దరి టాపిక్ బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వచ్చింది. నాగ చైతన్య, సమంత విడాకుల టాపిక్ గురించి బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడుకున్నారు. హౌస్లోని ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకునేటప్పుడు ఈ టాపిక్ చర్చకు వచ్చిందట. ఈ నలుగురిలో టాప్ కంటెస్టెంట్ గా ఉన్న ఓ అమ్మాయి మాట్లాడుతూ.. సమంతదే కరెక్ట్ అనగా.. మరొక మేల్ కంటెస్టెంట్ ఈ విషయంలో నాగ చైతన్యని సపోర్ట్ చేశాడట.
మిగిలిన ఇద్దరూ మాత్రం ఇది మనకు అనవసరమైన టాపిక్.. ఇలాంటి విషయాలు బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడకూడదు అని వారికి గుర్తు చేశారట. దీంతో వాళ్ళిద్దరూ ఇంతసేపు తప్పుగా మాట్లాడాము అని భావించి సైలెంట్ అయ్యారట. అయితే వెంటనే మా టీవీ యజమాన్యం మాత్రం వీరు మాట్లాడుకున్న వీడియోని డిలీట్ చేశారు అని ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది పుకారు మాత్రమేనా లేక ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…