Sai Pallavi : టాలీవుడ్లో మోస్ట్ క్యూట్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఎలాంటి గ్లామర్ షో చేయకపోయినా సాయిపల్లవికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అంటే ఆమె టాలెంట్ ఏపాటిదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యే ఆమె నటించిన విరాట పర్వం మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయినప్పటికీ సాయిపల్లవి ఇందులో అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. సినిమా మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. ఇక సాయిపల్లవి ఈ మూవీ రిలీజ్కు ముందు అనవసరంగా వివాదంలో చిక్కుకుని కొందరు ఫ్యాన్స్ను దూరం చేసుకుంది. లేకపోతే విరాటపర్వంకు ఇంకా మంచి టాక్ వచ్చి ఉండేది.
అయితే సాయిపల్లవి తన వ్యక్తిత్వం పరంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమెకు గతంలో అనేక కంపెనీలు భారీ పారితోషికం ఇస్తామని, అందుకు యాడ్స్ చేయాలని ఆమెకు ఆఫర్లను ఇచ్చాయి. కానీ ఆమె వాటిని తిరస్కరించింది. తనకు సహజసిద్ధమైన అందమే ముఖ్యమని కనుక బ్యూటీ మాత్రమే కాదు, ఎలాంటి ప్రొడక్ట్స్ను తాను ప్రమోట్ చేయలేనని చెప్పింది. ఇక ఇటీవలే మరో కంపెనీ కూడా ఆమెకు భారీ మొత్తంలో ఇస్తామని చెప్పింది. అయినప్పటికీ ఆమె ఆ ఆఫర్ను కూడా సున్నితంగా తిరస్కరించి తన వ్యక్తిత్వం ఎలాంటిదో మరోమారు చాటుకుంది.
సాయిపల్లవిని చాలా మంది డ్యాన్స్ మాత్రమే కాక.. ఆమె క్యారెక్టర్ అంటే కూడా ఇష్టపడుతుంటారు. అందుకనే ఆమెకు ఫ్యాన్స్ భారీగా ఉన్నారు. ఇక ఈ మధ్యే ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తనకు రానా, నాగచైతన్య మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. అయితే రానా తనకు విరాట పర్వం షూటింగ్ సమయంలో ఎంతో సహాయం చేశారని.. ఇక చైతన్య అంటే ఇష్టమని.. ఆయన తనను బాగా కేరింగ్గా చూసుకుంటారని.. ఆయనతో ఉంటే ఆయనది, తనది ఒకే ఫ్యామిలీ అన్న ఫీలింగ్ కలుగుతుందని సాయిపల్లవి తెలియజేసింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…