Sai Pallavi : సాయిపల్లవి.. ఫిదా మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తన నటనతో అందరినీ ఫిదా చేసింది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. కేవలం స్క్రీన్ పై ఆమెను చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు. ఇటీవల సాయి పల్లవి నటించిన విరాట పర్వం, గార్గి థియేటర్ లో కలెక్టన్స్ రాబట్ట లేకపోయినా.. పల్లవి నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.
ఇటీవల సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను పంచుకుంది. న్యూస్ 18 కథనం ప్రకారం.. ఓ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లేవని ఒప్పుకోవడంతో, సినిమా సగం షూట్ చేసాక లిప్ లాక్ సీన్ చేయాలంటూ సదరు దర్శకుడు సాయి పల్లవిపై ఒత్తిడి తీసుకువచ్చాడట. అయితే సాయి పల్లవి అందుకు ససేమిరా అందట. అలాంటి సీన్లలో చేయను అని ముందే చెప్పాను కదా అని సాయి పల్లవి వాదించిందట. ఈ సమయంలో ఆ సినిమా హీరో కలుగ చేసుకుని ఆమెను ఆ ఇబ్బంది నుంచి గట్టెక్కించాడట.
ఆమె చేయను అంటోంది కదా.. ఎందుకు ఒత్తిడి చేస్తారు. ఆమె వద్దు అనుకుంటున్నపుడు వదిలేయమని డైరెక్టర్ కు సలహా ఇచ్చాడట. మళ్లీ ఆమె మీటూ పేరిట బయట చెబితే అందరం ఇబ్బందుల్లో పడతాం అని చెప్పుకొచ్చాడట. దీంతో కన్విన్స్ అయిన డైరెక్టర్ సాయి పల్లవిని ఇక ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చింది. రొమాన్స్ అనే కాదు.. అన్ని విషయాల్లోనూ సాయి పల్లవి తన పరిధి మేరకే ప్రవర్తిస్తుంది. తన కుటుంబ సభ్యులు తన సినిమాని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలగాలి అని సాయి పల్లవి భావిస్తుంది. తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తూ.. అందరి చేత శభాష్ అనిపించుకుంది ఈ హైబ్రిడ్ పిల్లా.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…