Jr NTR : కోరుకున్న ప్రియుడు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్. నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా తెరంగ్రేటం చేసిన ఆయన హీరోగా అనేక సినిమాల్లో నటించాడు. అయితే ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం పెళ్లి. ఆ తర్వాత మనసిచ్చి చూడు, మా బాలాజీ, ప్రేమించే మనసు, చాలా బాగుంది సినిమాలతో హిట్లు అందుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే నవీన్ కెరీర్లో ఎంత వేగంగా ఎదిగాడో అంతకంటే వేగంగా డౌన్ అయిపోయాడు.
సుమారు పాతిక సినిమాల్లో హీరోగా నటించిన ఆయన అవకాశాలు తగ్గిపోవడంతో 2, 3 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు. అవికూడా ఫ్లాప్ అవడంతో ఆయన్ని ఎవరు పట్టించుకోలేదు. ప్రస్తుతం నవీన్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. వడ్డే నవీన్ నందమూరి కుటుంబానికి అల్లుడు అన్న సంగతి చాలామందికి తెలియదు. ఎన్టీఆర్ కొడుకులలో ఒకరైన నందమూరి రామకృష్ణ కూతురును వడ్డే నవీన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ సంబంధాన్ని కూడా ఎన్టీఆర్ సెట్ చేశారట.
జూనియర్ ఎన్టీఆర్ కు వడ్డే నవీన్ మంచి స్నేహితుడని అప్పట్లో టాక్ నడిచేది. పెళ్లికి ముందే వడ్డే నవీన్ రామకృష్ణ కూతురుతో ప్రేమలో ఉండేవాడట. ఎన్టీఆర్ వల్ల ఈ పెళ్లి జరిగిందని సమాచారం. అయితే ఆ తరువాత ఏమి జరిగిందో కానీ వడ్డే నవీన్ విడాకులు ఇచ్చి వేరొక పెళ్లి చేసుకున్నాడు. నందమూరి కుటుంబంతో బంధుత్వం తెంచుకున్నాడు. కానీ నందమూరి హీరో ఎన్టీఆర్తో మాత్రం నవీన్ సన్నిహితంగా ఉన్నాడంట. ఈ విషయం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…