Sai Dharam Tej : ప్రస్తుతం ఉన్న హైటెక్ టెక్నాలజీ వల్ల కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి కూడా అదే రేంజ్ లో ఉంది. సామాన్య ప్రజలు కనుక కార్పోరేట్ హాస్పిటల్స్ కు వెళ్తే వాళ్ళ ముత్తాతల ఆస్తులు కూడా రాయించేసుకుంటారు. అలాగే సెలబ్రిటీల విషయంలో ఎలా ఉంటుందనేది ఇంకా సస్పెన్స్. లేటెస్ట్ గా బైక్ యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలి హాస్పిటల్ లో చేరిన సాయి ధరమ్ తేజ్ 36 రోజులు ఉన్నారు. అయితే సాయి తేజ్ కి ఎంత బిల్ వేసారనే విషయం ఇప్పటి వరకు తెలీదు. సెప్టెంబర్ 10 నుండి సాయి తేజ్ హాస్పిటల్లో ఉండగా.. అక్టోబర్ 15వ తేదీన అతని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
దాదాపు యాక్సిడెంట్ జరిగిన 10 రోజులు అసలు సాయి తేజ్ హెల్త్ కండిషన్ ఎలా ఉందో ఎవరికీ తెలీదు. సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ కోమాలోకి వెళ్ళాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రతి రోజు వైద్యులు సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేస్తూ మీడియాకి అందించారు. ఎప్పటికప్పుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా వివరిస్తూ వచ్చారు. అలాగే సాయి తేజ్ హాస్పిటల్ లో ఉండగానే ఆయన నటించిన లేటెస్ట్ సినిమా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు సినిమాను కూడా రిలీజ్ చేశారు.
సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినట్లుగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. సాయికి మరో జన్మలాంటిది.. అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడటం అనేది నిజంగా పునర్జన్మ అంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో సాయి తేజ్ కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. కనుక ఆయన హాస్పిటల్ బిల్ అందులోనే కవర్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎంత బిల్ అయ్యిందనే వార్తలు మాత్రం బయటకు రాలేదు. 35 రోజుల బిల్ సాయి తేజ్ ఇన్సూరెన్స్ పాలసీలోనే కట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఉజ్జాయింపు లెక్కల ప్రకారం.. సుమారుగా రూ.5 కోట్లకు పైగానే బిల్ అయి ఉంటుందని అర్థం అవుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…