Sai Dharam Tej : దసరా పండుగ రోజు మెగా ఫ్యాన్స్కు నిజంగా గుడ్ న్యూసే అని చెప్పవచ్చు. ఎన్నో రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు ఇంటికి చేరుకుంటున్నారు. మాదాపూర్ దుర్గం చెరువు కేబల్ బ్రిడ్జిపై బైక్ యాక్సిడెంట్కు గురైన సాయిధరమ్ తేజ్కు కాలర్ బోన్ శస్త్ర చికిత్స చేశారు. తరువాత కొన్ని రోజుల పాటు కోమాలో ఉన్నాడు. అయితే ఎట్టకేలకు పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్ ను అపోలో వైద్యులు ఇంటికి పంపిస్తున్నారు.
దసరా పండుగ రోజు సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జి అవుతుండడం మెగా ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇస్తోంది. వారు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సాయిధరమ్ తేజ్ బర్త్ డే కూడా ఇదే రోజు కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. హాస్పిటల్లో విషమ స్థితిలో చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అవుతుండడం మెగా ఫ్యామిలీకి కూడా ఆనందాన్నిస్తోంది.
అయితే సాయిధరమ్ తేజ్ హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆయన సినిమా రిపబ్లిక్ విడుదల అయింది. విమర్శకుల నుంచి కూడా ఈ మూవీ ప్రశంసలను అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. మూవీ మెసేజ్ ఓరియెంటెడ్ అయి ఉండడమే దీనికి కారణమని, రివ్యూలు పాజిటివ్గా ఉన్నా ప్రేక్షకులు సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపించడం లేదని అర్థమైంది. అయితే సాయి ధరమ్ తేజ్ మాత్రం ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తుండడం.. నిజంగా హ్యాపీ న్యూసే అని చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…