Sai Dharam Tej : దసరా పండుగ రోజు మెగా ఫ్యాన్స్కు నిజంగా గుడ్ న్యూసే అని చెప్పవచ్చు. ఎన్నో రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు ఇంటికి చేరుకుంటున్నారు. మాదాపూర్ దుర్గం చెరువు కేబల్ బ్రిడ్జిపై బైక్ యాక్సిడెంట్కు గురైన సాయిధరమ్ తేజ్కు కాలర్ బోన్ శస్త్ర చికిత్స చేశారు. తరువాత కొన్ని రోజుల పాటు కోమాలో ఉన్నాడు. అయితే ఎట్టకేలకు పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్ ను అపోలో వైద్యులు ఇంటికి పంపిస్తున్నారు.
దసరా పండుగ రోజు సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జి అవుతుండడం మెగా ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇస్తోంది. వారు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సాయిధరమ్ తేజ్ బర్త్ డే కూడా ఇదే రోజు కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. హాస్పిటల్లో విషమ స్థితిలో చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అవుతుండడం మెగా ఫ్యామిలీకి కూడా ఆనందాన్నిస్తోంది.
అయితే సాయిధరమ్ తేజ్ హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆయన సినిమా రిపబ్లిక్ విడుదల అయింది. విమర్శకుల నుంచి కూడా ఈ మూవీ ప్రశంసలను అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. మూవీ మెసేజ్ ఓరియెంటెడ్ అయి ఉండడమే దీనికి కారణమని, రివ్యూలు పాజిటివ్గా ఉన్నా ప్రేక్షకులు సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపించడం లేదని అర్థమైంది. అయితే సాయి ధరమ్ తేజ్ మాత్రం ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తుండడం.. నిజంగా హ్యాపీ న్యూసే అని చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…