గురువారం, జూన్ 11, 2026
ఆధ్యాత్మికం

Sabarimala Prasadam : శబరిమల అయ్యప్ప ప్రసాదం గురించి.. చాలామందికి తెలియని నిజాలు ఇవి..!

Sabarimala Prasadam : చాలామంది శబరిమల వెళుతూ ఉంటారు. అయ్యప్ప మాల దీక్ష చేస్తూ, 41 రోజులు దీక్ష పూర్తయ్యాక, ఇరుముడి కట్టుకుని శబరిలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు. అయితే, అయ్యప్ప స్వామి దగ్గరికి…

Sabarimala Prasadam : శబరిమల అయ్యప్ప ప్రసాదం గురించి.. చాలామందికి తెలియని నిజాలు ఇవి..!

Sabarimala Prasadam : చాలామంది శబరిమల వెళుతూ ఉంటారు. అయ్యప్ప మాల దీక్ష చేస్తూ, 41 రోజులు దీక్ష పూర్తయ్యాక, ఇరుముడి కట్టుకుని శబరిలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు. అయితే, అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా, అక్కడ స్వామి వారి ప్రసాదాన్ని తీసుకువస్తూ ఉంటారు. ఒక డబ్బాలో నల్లగా ఉన్న ప్రసాదం ని వాళ్ళు తీసుకొస్తారు. దీనిని మీరు కూడా, చాలాసార్లు తినే ఉంటారు. అయితే, చాలా మందికి అయ్యప్ప స్వామి గురించి తెలుసు.

కానీ, ఈ ప్రసాదం గురించి చాలా విషయాలు తెలియదు. ఈరోజు శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం కి సంబంధించిన, కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూద్దాము. చాలామందికి, శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఎంతో ఇష్టం. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాక, స్వాములు అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని తీసుకువస్తూ ఉంటారు. దీని పేరు అరవణి ప్రసాదం.

Sabarimala Prasadam important facts to know
Sabarimala Prasadam

దీనిని బియ్యం, నెయ్యి, బెల్లం తో చేస్తారు. ఇది కేవలం రుచిగా ఉండడమే కాకుండా పోషక పదార్థాలతో కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అయ్యప్ప స్వామి ప్రసాదం మంచిదే. చలికాలంలో అరవణి ప్రసాదం తినడం వలన, శరీరంలో వేడి కలుగుతుంది. ఈ ప్రసాదానికి వాడే బియ్యం మావెలిక్కరలోని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టికులంగర దేవి ఆలయం నుండి వస్తాయి.

ప్రతి ఏటా కూడా ఈ దేవాలయాన్ని, కనీసం రెండు నుండి పది లక్షల మంది దర్శించుకుంటారు. భక్తుల కోసం ప్రతి ఏడాది కూడా, ఇక్కడ 80 లక్షల అరవణి ప్రసాదాన్ని తయారు చేస్తారు. తిరుమల తర్వాత ఎక్కువ మంది వెళ్లే దేవాలయం ఇది. అనేకమంది భక్తులు ప్రతి ఏటా కూడా శబరిమల అయ్యప్ప స్వామి ని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు. శబరిమల లోని ఈ ప్రసాదం, తిరుపతి లడ్డు తర్వాత పేరుపొందిన ప్రసాదం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.