Roja : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హోరా హోరీగా సాగాయి. నువ్వా నేనా అన్నంత స్థాయిలో గతంలో ఎన్నడూ లేనంత హైప్ ఈ సారి మా ఎన్నికలకు వచ్చింది. అయితే చివరికి ఉత్కంఠ పోరులో మంచు విష్ణుదే పైచేయి అయింది. ఆయన ప్రకాష్ రాజ్పై అద్భుతమైన విజయాన్ని సాధించారు. దీంతో మంచు విష్ణుకు ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎన్నికలు ఆద్యంతం మా సభ్యురాలు అయిన ఎమ్మెల్యే రోజా మాత్రం సైలెంట్గా ఉన్నారు. పోలింగ్ కేంద్రానికి కూడా పెద్ద హంగు ఆర్భాటం లేకుండా సైలెంట్గా వచ్చి ఓటు వేసి నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోయారు. ఫైర్ బ్రాండ్గా రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్న రోజా మా ఎన్నికల్లో మాత్రం సైలెంట్గా ఉండడంపై రక రకాల చర్చలు కొనసాగుతున్నాయి.
మా ఎన్నికల పోరులో భాగంగా కొందరు టీడీపీ నాయకులు అప్పటికే మంచు విష్ణుకు వైసీపీ మద్ధతు ఉందని ఆరోపించారు. తరువాత మంత్రి పేర్ని నాని అదేమీ లేదని కొట్టి పారేశారు. మా ఎన్నికలకు, తమ ప్రభుత్వానికి, పార్టీకి ఏమీ సంబంధం లేదని తేల్చేశారు. అయినప్పటికీ మంచు విష్ణు విజయం వెనుక వైసీపీతోపాటు బీజేపీ కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత ఉత్కంఠ పోరులో ఫైర్ బ్రాండ్ రోజా మాత్రం ఎక్కడా కామెంట్లు చేయలేదు. సంచలన వ్యాఖ్యలు చేయలేదు.
అయితే మా ఎన్నికల్లో రోజా సైలెంట్గా ఉండడానికి కారణం.. అప్పటికే వైసీపీ మద్దతు మంచు విష్ణుకు ఉందని ఆరోపణలు వస్తున్నాయి, కనుక ఆ సమయంలో ఆమె విష్ణుకు మద్దతుగా మాట్లాడితే ఇంక ఆ ఆరోపణలకు బలం చేకూరుతుంది, అది ప్రభుత్వానికి, పార్టీకి కొంత నష్టం కలిగించవచ్చు.. అన్న ఉద్దేశం ఉండి ఉంటుంది. అందుకనే ఆమె సైలెంట్గా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అయినప్పటికీ ఆమె మంచు విష్ణుకే ఓటు వేస్తారన్నది జగమెరిగిన సత్యమే. అయితే ఇకపై ఎలాంటి పరిణామాలు ఏర్పడుతాయో చూడాలి..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…