Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు, ప్రకాష్ రాజు ప్యానెల్ ల మధ్య తీవ్ర పోటీ ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. పరస్పర మాటల యుద్ధం తర్వాత మా ఎన్నికలు ఎంతో రసవత్తరంగా కొనసాగి చివరికి మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు ప్రత్యర్థులపై గట్టి పోటీగా నిలబడి ప్రెస్ మీట్ పెట్టి వారికి సరైన సమాధానం చెబుతూ ఎన్నికలలో తన హవా కొనసాగించారు.
ఇలా మా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న తర్వాత తన ప్లాన్ ఏమిటి అనే విషయానికి వస్తే.. మంచు విష్ణు రాజకీయాలలోకి రావాలనే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. మోహన్ బాబు కోరిక మేరకు తన వారసులు రాజకీయాల్లో అడుగు పెట్టాలని భావించేవారు. ఇక విష్ణు తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తాడని మా ఎన్నికలు స్పష్టం చేశాయి.
ఇక విష్ణు భార్య స్వయానా సీఎం వైఎస్ జగన్ కు కజిన్ సిస్టర్ కావడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా విష్ణుకు ఎంతో సులభతరం అవుతుందని పలువురు భావిస్తున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ప్రత్యర్థులకు ఏ విధమైనటువంటి పోటీ ఇవ్వాలో మా ఎన్నికల ద్వారా విష్ణు తెలుసుకున్నారు. ఇక విష్ణు, జగన్ పలు సందర్భాలలో కలిసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ అవకాశాలను ఉపయోగించుకొని విష్ణు రాజకీయాల్లోకి వస్తారని భావిస్తున్నారు. మరి మోహన్ బాబు కోరికను విష్ణు నెరవేరుస్తారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…