Kondapolam : మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ఈ నెల 1వ తేదీన విడుదల అయిన విషయం విదితమే. ఈ మూవీకి చక్కని రివ్యూలు కూడా వచ్చాయి. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన కలెక్షన్లను రాబట్టలేకపోతోంది.
ఇక సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ మూవీ కొండపొలం పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కొండపొలం మూవీ గత వారం విడుదల కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లలో జనాలు అసలు కనిపించడం లేదు. ఆక్యుపెన్సీ సాధించడమే కష్టంగా మారింది.
రిపబ్లిక్ మూవీకి థియేటర్లలో వచ్చిన ఆక్యుపెన్సీలో సగం స్థాయిని కూడా కొండపొలం మూవీ అందుకోలేకపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొండపొలం మూవీకి నిజానికి విమర్శకుల నుంచి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. అయిప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టడం లేదు.
అయితే ఈ రెండు సినిమాల జోనర్ ఒక్కటే. సీరియస్నెస్తోపాటు సమాజానికి సందేశాన్ని ఇచ్చే మూవీలు. కనుక ప్రేక్షకులకు ఈ జోనర్లు ఇప్పుడు అంతగా నచ్చడం లేదని స్పష్టమైంది. వారు ఫన్, ఎంటర్టైన్మెంట్ను కోరుకుంటున్నారని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…