Roja : అందాల రోజా ఒకప్పుడు తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తరువాత రాజీయాల్లో చేరి అందులోనూ రాణించారు. మొదట్లో ఆమె రాజకీయాల్లో అన్నీ ఓటములనే చవిచూశారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఆమె లక్ మారింది. నగరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఓ వైపు సినిమాలు.. టీవీ షోలలో నటిస్తూనే.. మరోవైపు ప్రజా సేవలో, రాజకీయాల్లో రోజా యాక్టివ్గా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆమెకు మంత్రి పదవి లభించింది. తన ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. అయితే మంత్రి పదవి వచ్చిన కారణంగా ఆమె ఇక టీవీ షోలు, సినిమాలు చేయనని తేల్చి చెప్పారు.
ప్రజా సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వెళ్లానని.. ఇక ఇప్పుడు మంత్రి పదవి వచ్చింది కాబట్టి బాధ్యత మరింత పెరిగిందని.. కనుక టీవీ షోలు, సినిమాల్లో చేయలేనని.. రోజా తెలిపారు. అందువల్ల ఇకపై ఆమె బుల్లితెర.. వెండితెరలపై కనిపించరు. అయితే ఆమె జబర్దస్త్కు గుడ్ బై చెప్పారు కనుక ఆమెకు నిర్వాహకులు ఓ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి రోజా హాజరయ్యారు. జబర్దస్త్ కమెడియన్లు.. సిబ్బంది అంతా కలిసి రోజాకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కమెడియన్లతోపాటు.. రోజా కూడా ఎమోషనల్ అయ్యారు.
జబర్దస్త్ను విడిచిపెడుతుండడం బాధగా ఉందని.. కానీ నటన అనేది సెకండరీ అని.. తనకు ప్రజా సేవ ముఖ్యమని.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటే ఇక టీవీ షోలు, సినిమాలు చేయలేనని.. చేస్తే ప్రజలకు దూరం అవుతానని.. కనుకనే అన్నింటినీ విడిచిపెట్టాల్సి వస్తుందని.. రోజా తెలిపారు. ఇక వీడ్కోలు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ప్రస్తుతం విడుదల చేయగా.. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…