Roja : అందాల రోజా ఒకప్పుడు తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తరువాత రాజీయాల్లో చేరి అందులోనూ రాణించారు. మొదట్లో ఆమె రాజకీయాల్లో అన్నీ ఓటములనే చవిచూశారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఆమె లక్ మారింది. నగరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఓ వైపు సినిమాలు.. టీవీ షోలలో నటిస్తూనే.. మరోవైపు ప్రజా సేవలో, రాజకీయాల్లో రోజా యాక్టివ్గా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆమెకు మంత్రి పదవి లభించింది. తన ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. అయితే మంత్రి పదవి వచ్చిన కారణంగా ఆమె ఇక టీవీ షోలు, సినిమాలు చేయనని తేల్చి చెప్పారు.
ప్రజా సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వెళ్లానని.. ఇక ఇప్పుడు మంత్రి పదవి వచ్చింది కాబట్టి బాధ్యత మరింత పెరిగిందని.. కనుక టీవీ షోలు, సినిమాల్లో చేయలేనని.. రోజా తెలిపారు. అందువల్ల ఇకపై ఆమె బుల్లితెర.. వెండితెరలపై కనిపించరు. అయితే ఆమె జబర్దస్త్కు గుడ్ బై చెప్పారు కనుక ఆమెకు నిర్వాహకులు ఓ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి రోజా హాజరయ్యారు. జబర్దస్త్ కమెడియన్లు.. సిబ్బంది అంతా కలిసి రోజాకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కమెడియన్లతోపాటు.. రోజా కూడా ఎమోషనల్ అయ్యారు.
జబర్దస్త్ను విడిచిపెడుతుండడం బాధగా ఉందని.. కానీ నటన అనేది సెకండరీ అని.. తనకు ప్రజా సేవ ముఖ్యమని.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటే ఇక టీవీ షోలు, సినిమాలు చేయలేనని.. చేస్తే ప్రజలకు దూరం అవుతానని.. కనుకనే అన్నింటినీ విడిచిపెట్టాల్సి వస్తుందని.. రోజా తెలిపారు. ఇక వీడ్కోలు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ప్రస్తుతం విడుదల చేయగా.. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…