Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్డెకు చూస్తుంటే ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు ఉంది. గతేడాది ఈమె నటించిన అన్ని చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఈమె కెరీర్లో ఎన్నడూ లేని విధంగా మొన్నటి వరకు టాప్ గేర్లో దూసుకుపోయింది. కానీ ఈమె నటించిన తాజా చిత్రాలు రెండూ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో పూజా హెగ్డెకు బెంగ పట్టుకున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ విషయం అలా ఉంచితే.. పూజా హెగ్డెను మాత్రం నెటిజన్లు మరో విషయంలో ట్రోల్ చేస్తున్నారు.
విజయ్, పూజా హెగ్డె జంటగా నటించిన బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే ఈ మూవీకి తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. సాక్షాత్తూ విజయ్ ఫ్యాన్సే సినిమా అస్సలు బాగా లేదని.. ఏకంగా థియేటర్లో తెరకు నిప్పు పెట్టారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా రెండు వరుస ఫ్లాప్లతో పూజా హెగ్డె విచారంలో ఉంది. దీనికి పుండు మీద కారం చల్లినట్లుగా మరోవైపు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
నిజానికి బీస్ట్ చిత్రంలో పూజా హెగ్డె హీరోయిన్ అయినప్పటికీ.. ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత కల్పించలేదనే చెప్పాలి. విజయ్ చేసే యాక్షన్ను చూస్తూనే ప్రేక్షకులు సినిమాను వీక్షించాలని అనుకున్నారు కాబోలు.. పూజా హెగ్డె క్యారెక్టర్కు అసలు ప్రాధాన్యత లేకుండా పోయింది. అయితే ఇంత మాత్రానికే పూజా హెగ్డె సినిమా ప్రమోషన్లలో అంత హడావిడి చేయడం అవసరమా.. అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసింది.. అసలు సినిమాలో ఆమె మాకు కనిపించనే లేదు.. అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. రాధేశ్యామ్, బీస్ట్ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఇక పూజా హెగ్డె తన తదుపరి చిత్రం ఆచార్యపైనే హోప్స్ పెట్టుకుంది. మరి ఈ మూవీ అయినా ఆమెను రక్షిస్తుందో.. లేదో.. చూడాలి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…