Samantha : నయనతార, విజయ్ సేతుపతి, సమంత.. ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం.. కాతు వాకుల రెండు కాదల్. దీన్ని తెలుగులో కణ్మణి రాంబో కతీజా పేరిట విడుదల చేయనున్నారు. ఈ నెల 28వ తేదీన ఈ మూవీ తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. చాలా రోజుల తరువాత సమంత వెండితెరపై మరోమారు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. విడాకుల తరువాత రిలీజ్ అవుతున్న ఆమె నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. అయితే ఇందులో సమంత పాత్రను తీర్చిదిద్దిన తీరును ఆమె ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు.
కాతు వాకుల రెండు కాదల్ సినిమాను నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించారు. అయితే ఇందులో నయనతార గ్లామర్ షో చేయలేదు. టీజర్, పోస్టర్లను చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. అయితే సమంత మాత్రం గ్లామర్ షో చేసినట్లు అర్థమవుతోంది. దీంతో సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నీ ప్రియురాలు ఒకలా.. సమంత మరొకలా ఎందుకు.. నీ లవర్ అని చెప్పి నయనతారతో చీర కట్టించావా.. సమంత కాదు కదా.. కనుకనే ఆమెతో గ్లామర్ షో చేయిస్తున్నావా.. అంటూ సమంత ఫ్యాన్స్.. విగ్నేష్ శివన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే వాస్తవానికి నయనతార గ్లామర్ షో చేయడం మానేసి చాలా రోజులే అవుతోంది. ఆమె నటిగా మంచి గుర్తింపు పొంది.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నప్పటి నుంచి గ్టామర్ షో చేయడం లేదు. దీంతో ఆమె ప్రతి మూవీలోనూ సాధారణంగానే కనిపిస్తోంది. ఇక సమంత అలా కాదు. పెళ్లయినా కూడా గ్లామర్ షో చేస్తూనే వస్తోంది. ఇక విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఆ డోసు కాస్త పెంచిందే తప్ప తగ్గించలేదు. అందువల్ల గ్లామర్ షో చేయడం అనేది ఆమె ఇష్టమని.. అందులో దర్శకుడి ప్రమేయం ఉండదని.. గ్లామర్ షో ఉంటుందా.. ఉండదా.. అనేది సినిమా చేసే ముందే చెబుతారు కనుక.. సమంత మనస్ఫూర్తిగానే ఈ మూవీకి ఒప్పుకుందని తెలుస్తోంది. అందులో దర్శకున్ని తప్పు పట్టాల్సిన పనిలేదని కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒకరు బలవంతంగా గ్లామర్ షో చేయించలేరని అంటున్నారు. ఇక సినిమాలో సమంత ఎలా కనిపిస్తుందో చూడాలి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…